News April 28, 2024

T20WC: మే 1న భారత జట్టు ప్రకటన?

image

టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక తుదిదశకు చేరుకుంది. ఈ మేరకు ఈరోజు బోర్డు సభ్యులతో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌శర్మ సమావేశం అయ్యారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపికపై తీవ్రంగా చర్చించింది. మే 1న జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు మే 22న న్యూయార్క్‌‌కు బయలుదేరనున్నట్లు సమాచారం.

Similar News

News November 15, 2025

రాజకీయాలు, కుటుంబానికి గుడ్‌బై: లాలూ కూతురు

image

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.

News November 15, 2025

తండ్రయిన రాజ్‌కుమార్

image

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్‌కుమార్ రావు-పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. ఇవాళ వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్, పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. 2010లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాజ్.. స్త్రీ2 చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. పత్రలేఖ కూడా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.

News November 15, 2025

ఊడ్చే యంత్రాల అద్దె ఖరీదు తెలిస్తే షాకే!

image

బెంగళూరు రోడ్లను ఊడ్చేందుకు స్వీపింగ్ యంత్రాలను మరిన్ని అందుబాటులో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 46 స్వీపింగ్ యంత్రాలను ఏడేళ్ల పాటు అద్దెకు తీసుకునేందుకు ఏకంగా రూ.613కోట్లను కేటాయించింది. శుభ్రతపై కర్ణాటక ప్రభుత్వ చొరవ అభినందనీయమే అయినా అంత డబ్బు అద్దెకు ఖర్చు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. కొనుగోలు చేసినా ఇంత ఖర్చవదేమో.. ఎందుకంత డబ్బుల్రా బుజ్జీ అంటూ సెటైర్లు వేస్తున్నారు.