News June 13, 2024

T20WC: సూపర్-8లో భారత్-ఆసీస్ పోరు

image

టీ20 వరల్డ్ కప్‌లో యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా సూపర్-8కు దూసుకెళ్లింది. కాగా సూపర్-8లో ఆసీస్‌-భారత్ జూన్ 24న తలపడనున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8 చేరుకుంది. ఈ నెల 20న గ్రూప్ Cలోని అఫ్గానిస్థాన్ లేదా వెస్టిండీస్, 22న గ్రూప్ Dలోని బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌ జట్లతో టీమ్ ఇండియా మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Similar News

News October 6, 2024

రజినీ-మణిరత్నం కాంబోలో సినిమా?

image

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మణిరత్నం కలిసి చివరిగా 1991లో ‘దళపతి’కి పనిచేశారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 12న రజినీ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టుపై అధికారికంగా అనౌన్స్‌మెంట్ రావొచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కమల్ హాసన్‌తో సైతం ‘థగ్ లైఫ్’ ద్వారా 36 ఏళ్ల తర్వాత మణిరత్నం వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.

News October 6, 2024

ఆంధ్రుల హక్కు ముఖ్యమా.. పొత్తు ముఖ్యమా?: షర్మిల

image

AP: సీఎం చంద్రబాబుకు ఆంధ్రుల హక్కులు ముఖ్యమా, లేదంటే బీజేపీతో పొత్తు ముఖ్యమా అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అంశంపై మోదీ, అమిత్ షాను నిలదీయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కంటే పొత్తు ప్రయోజనాలు అంత ముఖ్యమేమీ కాదు’ అని ఆమె పేర్కొన్నారు.

News October 6, 2024

సీఎం రేవంత్ లేఖలో పొరపాటు.. BRS సెటైర్లు

image

TG: CM రేవంత్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై BRS సెటైర్లు వేస్తోంది. అందులో నేటి తేది(06.10.2024)కి బదులుగా (07.10.2024) పేర్కొనడం ఇందుకు కారణం. దీంతో పాటు ఆగస్టు 15 వరకు రూ.17,869.22 కోట్లు రుణమాఫీ చేశామని ఈరోజు సీఎం లేఖలో చెప్పగా ఆగస్టు 15న చేసిన ట్వీట్‌లో మాత్రం రూ.31,000 కోట్లు మాఫీ చేశామని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నాయి.