News June 20, 2024

T20WC: అఫ్గాన్‌తో మ్యాచ్‌.. సిరాజ్‌పై వేటు?

image

టీ20 వరల్డ్ కప్‌ సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు చోటివ్వాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. మ్యాచ్ జరిగే కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉండటంతో ఈ మార్పు చేయనున్నట్లు టాక్. కాగా ఈ మెగా టోర్నీలో కుల్దీప్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

Similar News

News December 12, 2025

హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్.. ఆరుగురికి 20 ఏళ్ల జైలు

image

మలయాళ హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్ <<18502408>>కేసులో<<>> ఆరుగురు నిందితులకు కేరళ ఎర్నాకుళం స్పెషల్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన నటుడు దిలీప్‌ను ఇటీవలే న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. మిగతా నిందితులైన సునీల్, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజీశ్, సలీమ్, ప్రదీప్‌కు ఇవాళ శిక్ష ఖరారు చేసింది. 2017లో హీరోయిన్‌పై గ్యాంగ్‌రేప్ దేశవ్యాప్తంగా సంచలనమైంది.

News December 12, 2025

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు!

image

అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం శుక్రవారం కేంద్ర క్యాబినెట్లో చర్చకు రాలేదు. AP నుంచి మరింత సమాచారం తీసుకుని క్యాబినెట్లో ఆమోదించి అనంతరం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కాగా సాంకేతిక సమస్యల పరిష్కారంపై AP కసరత్తు చేపట్టింది. 2014-2024 వరకు అమరావతినే రాజధానిగా గుర్తించేలా అది అధ్యయనం చేస్తోంది. ఫ్యూచర్లో రాజధానిని మార్చకుండా ఒకే క్యాపిటల్ ఉండేలా చర్య తీసుకుంటోంది.

News December 12, 2025

మరోసారి అన్నా హజారే నిరాహార దీక్ష

image

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేయనున్నారు. మహారాష్ట్రలో లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ దీక్ష చేపట్టనున్నారు. జనవరి 30నుంచి ఆయన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. 2022లో దీక్ష చేసినప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని ఆయన ఆరోపిస్తున్నారు.