News June 24, 2024
T20WC: ఆసీస్పై ప్రతీకారం తీర్చుకునేనా?
T20 WC సూపర్-8లో భాగంగా ఇవాళ భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిస్తే సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఆసీస్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. కాగా గతేడాది WTC ఫైనల్, ODI WC ఫైనల్లో భారత్ను ఆస్ట్రేలియా ఓడించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Similar News
News October 9, 2024
JOE ROOT: ‘గే’ అని గేలి చేసినా..!
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అన్స్టాపబుల్గా దూసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ఫామ్ ప్రదర్శించి ఏకంగా 18 సెంచరీలు బాదారు. కాగా రూట్ 2021కు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరచూ ఆయనను ప్రత్యర్థులు ‘గే’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆయన వాటినేం పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవారు. అతడిని ‘గే’ అని పిలిచినందుకు వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ 4 మ్యాచ్ల నిషేధం కూడా ఎదుర్కొన్నారు.
News October 9, 2024
3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి
TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.
News October 9, 2024
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్
రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. ‘ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్’కు గాను డేమిస్ హసాబిస్, జాన్ ఎం.జంపర్లకు, ‘కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్’కు గాను డేవిడ్ బెకర్కు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది.