News June 5, 2024
T20WC: ఓపెనర్లుగా రోహిత్-కోహ్లీ!

ఇవాళ రాత్రి 8 గంటలకు ఐర్లాండ్తో జరగనున్న మ్యాచ్లో రోహిత్తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. స్లో పిచ్ కావడంతో జైస్వాల్ బెంచ్కే పరిమితం కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు శివమ్ దూబే, పంత్కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్ష్దీప్
Similar News
News December 18, 2025
టుడే హెడ్లైన్స్

✥ AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు: చంద్రబాబు
✥ ప్రజల ప్రాణాలతో CBN చెలగాటం: సజ్జల
✥ TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే డామినేషన్.. 2వేలకు పైగా స్థానాలు కైవసం
✥ ఐదుగురు MLAల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్
✥ ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు: KTR
✥ దట్టమైన పొగమంచుతో భారత్-సౌతాఫ్రికా నాలుగో టీ20 రద్దు
News December 18, 2025
రెచ్చిపోతున్న బంగ్లాదేశ్.. భారత్పై అక్కసు

బంగ్లాదేశ్ అవకాశం చిక్కినప్పుడల్లా భారత్పై విషం చిమ్ముతోంది. కొన్ని రోజుల క్రితం ఢాకా వర్సిటీలో PM మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయనను దూషించారు. ఈశాన్య రాష్ట్రాలను(7 సిస్టర్స్) తమ దేశంలో కలిపేస్తామంటూ ఇద్దరు టాప్ స్టూడెంట్ లీడర్లు బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. ఇవాళ ఢాకాలోని భారత ఎంబసీ వద్ద ఆందోళనకు దిగారు. యూనుస్ బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి ఈ ధోరణి కనబడుతోంది.
News December 18, 2025
నాణ్యమైన నిద్ర కోసం 10-3-2-1-0 రూల్!

10-3-2-1-0 రూల్తో నాణ్యమైన నిద్ర సొంతమవుతుంది. నిద్రకు 10 గంటల ముందు కెఫిన్ ఉండే పదార్ధాలను (టీ, కాఫీ) తీసుకోవద్దు. 3 గంటల ముందే భోజనం చేయాలి. ఆల్కహాల్ తాగొద్దు. 2 గంటల ముందు పని, ఒత్తిడికి ఫుల్స్టాప్ పెట్టాలి. గంట ముందు మొబైల్/ల్యాప్టాప్ స్క్రీన్ ఆఫ్ చేయాలి. మార్నింగ్ అలారం మోగిన వెంటనే లేవాలి. స్నూజ్ బటన్ ఉపయోగించొద్దు. ఈ రూల్స్తో నిద్ర నాణ్యత పెరిగి రోజంతా ఫ్రెష్గా ఉంటారు. ప్రయత్నించండి!


