News June 5, 2024
T20WC: ఓపెనర్లుగా రోహిత్-కోహ్లీ!

ఇవాళ రాత్రి 8 గంటలకు ఐర్లాండ్తో జరగనున్న మ్యాచ్లో రోహిత్తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. స్లో పిచ్ కావడంతో జైస్వాల్ బెంచ్కే పరిమితం కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు శివమ్ దూబే, పంత్కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్ష్దీప్
Similar News
News December 22, 2025
అమ్మాయికి ఈ టెస్టులు చేయించండి..

ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారి ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వారు రజస్వల అయినప్పటి నుంచి వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. రక్తహీనత సమస్యను గుర్తించడానికి కంప్లీట్ బ్లడ్ కౌంట్, థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు, విటమిన్ప్రొఫైల్ టెస్ట్, ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలుంటే మూత్ర పరీక్ష చేయించాలి. వీటివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించే వీలుంటుంది.
News December 22, 2025
ఇంట్లో వెండి శివలింగం ఎందుకు ఉండాలి?

వెండి శుక్రుడు, చంద్రుడికి ప్రతీక. వెండి శివలింగ నిత్యారాధన ఆర్థిక బాధలు తొలగించి ఐశ్వర్యాన్ని ఇస్తుందని నమ్మకం. అలాగే ఇంట్లోని ప్రతికూల శక్తిని పంపి, కుటుంబంలో మానసిక ప్రశాంతతను, అన్యోన్యతను పెంచుతుందని విశ్వాసం. చంద్ర దోషం ఉన్నవారు, మానసిక ఒత్తిడితో బాధపడేవారు, సంతాన సమస్యలున్నవారు దీనిని పూజించాలట. తద్వారా శుభ ఫలితాలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. శివలింగారాధన ధైర్యాన్నిస్తుంది.
News December 22, 2025
వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు – కలుపు నివారణ

వరి మాగాణుల్లో మొక్కజొన్న విత్తాక కలుపు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కిలో అట్రజిన్ 50% పొడి మందును కలిపి పంట విత్తిన 48 గంటలలోపు నేలంతా తడిచేట్లు పిచికారీ చేయాలి. వరి దుబ్బులు తిరిగి చిగురించకుండా 200 లీటర్ల నీటిలో లీటరు పారాక్వాట్ కలిపి విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. దీని వల్ల విత్తిన 20-25 రోజుల వరకు ఎలాంటి కలుపు రాదు. అట్రజిన్+పారాక్వాట్ కలిపి కూడా పిచికారీ చేయవచ్చు.


