News June 5, 2024
T20WC: ఓపెనర్లుగా రోహిత్-కోహ్లీ!

ఇవాళ రాత్రి 8 గంటలకు ఐర్లాండ్తో జరగనున్న మ్యాచ్లో రోహిత్తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. స్లో పిచ్ కావడంతో జైస్వాల్ బెంచ్కే పరిమితం కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు శివమ్ దూబే, పంత్కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్ష్దీప్
Similar News
News December 19, 2025
FIFA WC విజేతకు రూ.450 కోట్లు

వచ్చే ఏడాది జూన్ 11 నుంచి జులై 19 వరకు US, కెనడా, మెక్సికోలో ఫుట్బాల్ WC జరగనుంది. దీని నిర్వహణ, 48 జట్లకు పంపిణీ చేసేందుకు దాదాపు ₹6,000Crను FIFA వెచ్చించనుంది. విజేతకు ₹451Cr, రన్నరప్కు ₹297Cr, మూడో స్థానానికి ₹261Cr, ఫోర్త్ ప్లేస్కు ₹243Cr అందించనుంది. 5-8 స్థానాల్లోని జట్లకు ₹171Cr, 9-16 టీమ్స్కు ₹135Cr, 17-32 జట్లకు ₹99Cr, 33-48 స్థానాల్లో నిలిచిన జట్లకు ₹81Cr చొప్పున డబ్బు ఇవ్వనుంది.
News December 19, 2025
బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి?

నుదిటిపై కుంకుమను ధరించిన ప్రతీసారి ఉంగరపు వేలును ఉపయోగించడం మేలని, తద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే, ఈ వేలు సంపూర్ణ జల సూత్రాన్ని ఆకర్షిస్తుందట. తద్వారా బొట్టు పెట్టిన వారికి కూడా చాలా లాభాలుంటాయట. శరీరంలో శక్తి ప్రవాహాన్ని పెంచుకోవాలంటే ఈ నియమాన్ని పాటించాలని పండితులు చెబుతారు. ముఖ్యంగా స్త్రీలు కచ్చితంగా ఉంగరం వేలితోనే బొట్టు పెట్టుకోవాలట.
News December 19, 2025
బ్రెస్ట్ క్యాన్సర్ రాకూడదంటే?

మహిళల్లో అధిక బరువు, ఆధునిక జీవనశైలిలో భాగంగా ఆహారాల్లో కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకోవడం, పెళ్లి, తొలిచూలు బిడ్డ పుట్టడంలో ఆలస్యం జరగడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. అలాగే కుటుంబ ఆరోగ్య చరిత్రలో రొమ్ము క్యాన్సర్ వచ్చినవారు ఉన్నప్పుడు… బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జన్యు పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాలను బట్టి చికిత్స చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


