News June 28, 2024
T20WC: రోహిత్ శర్మ ఎమోషనల్!

టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆనందంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. డగౌట్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సహచర ఆటగాళ్లు ఆయనను ఓదారుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా రోహిత్ ఐసీసీ టోర్నమెంట్లలో 27 మ్యాచ్లకు సారథ్యం వహించారు. అందులో 24 మ్యాచుల్లో జట్టును గెలిపించారు. 4 మ్యాచుల్లో ఓటమిపాలయ్యారు. విన్నింగ్ పర్సంటేజీ 81.47%గా ఉంది.
Similar News
News January 22, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్కు 160 CRPC కింద నోటీసులు జారీ చేసింది. నందినగర్లోని ఆయన ఇంటికి నోటీసులు పంపింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. కాగా రెండు రోజుల క్రితమే మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ 7 గంటల పాటు విచారించింది.
News January 22, 2026
RITES లిమిటెడ్ 48 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 22, 2026
సీఎం రేవంత్తో మంత్రి లోకేశ్ భేటీ

దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ను శాలువాతో సత్కరించారు. ఇరు రాష్ట్రాల్లోని విద్యా సంస్కరణలు, ఐటీ అభివృద్ధి, స్కిల్ డెలవప్మెంట్పై తామిద్దరం చర్చించినట్లు లోకేశ్ తెలిపారు. కాగా దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునూ సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది.


