News June 24, 2024
T20WC: పడి లేచిన కెరటం ఇంగ్లండ్..!

టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లండ్ జర్నీ పడుతూ లేస్తూ కొనసాగుతోంది. లీగ్ స్టేజీలోనే దాదాపు ఎలిమినేట్ అయ్యే దశకు ఆ జట్టు చేరుకుంది. మరో 15 నిమిషాలు వర్షం కురిసుంటే ఇంగ్లండ్ అప్పుడే టోర్నీ నుంచి నిష్క్రమించేది. చివరకు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో నమీబియాపై గెలిచింది. సూపర్-8కు చివరగా అర్హత సాధించింది ఇంగ్లండ్ జట్టే. అలాగే సెమీఫైనల్కు అర్హత సాధించిన తొలి జట్టు కూడా ఇదే.
Similar News
News December 26, 2025
బిందు సేద్యం.. ఈ జాగ్రత్తలు తీసుకుందాం

సాగులో నీటి వృథా కట్టడికి వాడే డ్రిప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ట్రాక్టర్లు, బండ్లు, పశువుల రాకపోకల వలన లేటరల్ పైపులు అణిగిపోకుండా చూడాలి. ఎలుకలు డ్రిప్ సిస్టమ్లోని లేటరల్ పైపులను, ఇతర భాగాలను కొరికేయకుండా ఉండాలంటే సిస్టమ్ను తరచూ వాడాలి. దీని వల్ల భూమి తేమగా ఉండి ఎలుకలు ఆ పైపుల దగ్గరకురావు. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలు డ్రిప్ లేటరల్ పైపులను కోసేయకుండా జాగ్రత్తపడాలి.
News December 26, 2025
రేపే రాజాసాబ్ ‘ప్రీ రిలీజ్’ ఈవెంట్

మారుతీ-ప్రభాస్ కాంబోలో రాజాసాబ్ చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్కు మూవీ టీమ్ అదిరిపోయే గుడ్న్యూస్ అందించింది. HYDలో రేపు సా.5 గంటలకు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.
News December 26, 2025
SM వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

16 ఏళ్లలోపు పిల్లలకు SM వాడకాన్ని బ్యాన్ చేసేలా ఆస్ట్రేలియా తరహాలో చట్టం చేయాలని మద్రాస్ హైకోర్టు కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇంటర్నెట్లో అడల్ట్ కంటెంట్ యాక్సెస్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. పేరెంటల్ కంట్రోల్స్ అందుబాటులోకి తెచ్చేలా ISPలను ఆదేశించాలని TN మధురై జిల్లాకు చెందిన ఎస్.విజయ్ కుమార్ PIL వేశారు. దానిపై విచారించిన జస్టిస్ జి.జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ పై వ్యాఖ్యలు చేశారు.


