News October 14, 2024

టర్కిష్ ఎయిర్‌లైన్స్‌పై తాప్సీ ఆగ్రహం

image

టర్కిష్ ఎయిర్ లైన్స్‌పై హీరోయిన్ తాప్సీ ఫైర్ అయ్యారు. విమానం ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘విమానం 24 గంటల ఆలస్యం అనేది మీ సమస్య. ప్రయాణికుల సమస్య కాదు. కస్టమర్ కేర్ సర్వీస్ కూడా అందుబాటులో లేదు. దీంతో తోటి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా ఇటీవల శృతి హాసన్ కూడా ఇండిగో సంస్థపై మండిపడిన సంగతి తెలిసిందే.

Similar News

News February 5, 2026

ప్రచార జోరు.. గత హామీలు నెరవేర్చారా?

image

TG: మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. గత ఐదేళ్లలో మీ వార్డులో మౌలిక వసతులు మెరుగయ్యాయా? గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. మళ్లీ ఓటు అడిగేందుకు వచ్చిన వారికి గత హామీలను గుర్తుచేయండి. డ్రైనేజీ, రోడ్డు, నీటి వసతులపై పట్టుబట్టండి. అభివృద్ధిని కాంక్షించే, ప్రజలకు అందుబాటులో ఉండే సమర్థుడైన నాయకుడికి జై కొట్టండి. మరి ఐదేళ్లలో మీ ఊరు ఏమైనా మారిందా? COMMENT

News February 5, 2026

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్

image

AP: ప్రైవేటు స్కూళ్లలో RTE చట్టం కింద పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు 25% సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా 2026-27 ఏడాదికి 1వ తరగతిలో ప్రవేశానికి షెడ్యూల్‌ విడుదల అయ్యింది. FEB 6-16 వరకు పోర్టల్‌లోని స్కూళ్ల డేటాను అప్‌డేట్ చేస్తారు. FEB 20-MAR 10 వరకు విద్యార్థుల నమోదు ఉంటుంది. MAR 25న మొదటి విడత లాటరీ ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని SSA డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

News February 5, 2026

‘ఎనర్జీ’లో రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడి.. ఏపీకి నీతి ఆయోగ్ బ్లూ ప్రింట్

image

AP: నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం ఇవాళ సచివాలయంలో CS విజయానంద్‌ను కలిసి ఎనర్జీ ట్రాన్సిషన్ డ్రాఫ్ట్ బ్లూప్రింట్‌ను అందించారు. దీని అమలు ద్వారా రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడితో AP రెన్యువబుల్ ఎనర్జీ కేంద్రంగా మారుతుంది. 5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. పగటి పూట నిరాటంక సరఫరాతోపాటు యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.4కి, సరఫరా ఖర్చు రూ.6కు తగ్గుతుంది. కాగా దీని అమలుకు వార్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.