News April 30, 2024

Tail Pond: నీటి తరలింపుపై APకి KRMB లేఖ

image

AP: నాగార్జునసాగర్ దిగువన ఉన్న టెయిల్‌పాండ్ నుంచి తమ అనుమతి లేకుండా నీటిని తరలించడంపై AP నీటిపారుదలశాఖకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు లేఖ రాసింది. ఈ నెల 13న తూములు తెరిచి.. 3టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం మళ్లించుకుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎందుకు మళ్లించిందో వివరణ ఇవ్వాలని KRMB కోరింది.

Similar News

News April 1, 2026

ఇవాళ్టి నుంచి చికెన్ షాపులు బంద్

image

తెలంగాణలో కోడి మాంసం ప్రియులకు బ్యాడ్‌న్యూస్. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచాలనే డిమాండ్‌తో రిటైల్ యజమానులు నేటి నుంచి చికెన్ షాపులు క్లోజ్ చేశారు. గతంలో మార్జిన్ కేజీకి రూ.26 ఇవ్వగా ఇటీవల పౌల్ట్రీలు దాన్ని రూ.16కు తగ్గించాయి. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఓనర్స్ అంటున్నారు. మార్జిన్‌ను రూ.30కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన నేపథ్యంలో చికెన్ దుకాణాలు 2-3 రోజుల వరకు మూతపడే అవకాశం ఉంది.

News April 1, 2026

‘అమరావతికి చట్టబద్ధత’ అంటే ఏం చేస్తారు?

image

ఉమ్మడి <<19529271>>ఆంధ్రప్రదేశ్‌ను<<>> 2014లో విభజించారు. AP, TGకి పదేళ్లు HYD ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. ఆ తర్వాత ‘ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఉంటుంది’ అని సెక్షన్ 5, సబ్‌సెక్షన్ 2లో పొందుపర్చారు. ఇప్పుడు సవరణ బిల్లులో ‘ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి నూతన రాజధానిగా ఉంటుంది’ అని మారుస్తారు. ఇక CRDA నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధాని పరిధిలోకే వస్తుందనే అంశాన్నీ బిల్లులో చేర్చారు.

News April 1, 2026

₹50 నుంచి ₹కోట్ల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి..!

image

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తొలినాళ్లలో రెమ్యునరేషన్ గురించి తోటి నటుడు శ్రీనివాసన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 1980లో ‘విలక్కనుండు స్వప్నంగళ్’ అనే సినిమాలో చేసిన పాత్రకు మమ్ముట్టికి ఇచ్చింది 50 రూపాయలేనని తెలిపారు. అందులో గుర్తింపు రావడంతో ఆ తర్వాత సినిమా ‘మేళా’కు ₹800 అందుకున్నారని చెప్పారు. ఆ ₹800లకే మమ్ముట్టి ఎంతో సంతోషపడ్డారని అన్నారు. కాగా ప్రస్తుతం మమ్ముట్టి ₹10-20Cr అందుకుంటున్నారు.