News June 7, 2024
తైవాన్ చైనాలో అంతర్భాగమే: చైనా ఎంబసీ

తైవాన్ చైనాలో అంతర్భాగమని భారత్లోని ఆ దేశ ఎంబసీ పునరుద్ఘాటించింది. వన్ చైనా పాలసీని ప్రపంచ దేశాలు గుర్తించాయని తెలిపింది. చైనాతో దౌత్యసంబంధాలు ఉన్న నేపథ్యంలో భారత్ తైవాన్ నేతల రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించింది. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ ఇటీవల ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేసింది. తైవాన్-భారత్ బంధం బలోపేతానికి కృషి చేయాలని లాయ్ పేర్కొనడాన్ని చైనా తప్పుపట్టింది.
Similar News
News September 9, 2025
డొనాల్డ్ ట్రంప్ మనవరాలిని చూశారా?

యూఎస్ ఓపెన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ సందడి చేసింది. ఈ ఈవెంట్కు ట్రంప్తో పాటు ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లా రోజ్ కుష్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియా కళ్లన్నీ 13 ఏళ్ల అరబెల్లానే ఫోకస్ చేయడంతో ఆమె హైలైట్ అయ్యారు. తన తాత ట్రంప్తో ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎంపీలతో లోకేశ్ భేటీ

AP: ఉపరాష్ట్రపతి ఓటింగ్ ప్రక్రియపై మంత్రి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. కాగా టీడీపీకి లోక్సభలో 16, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలం ఉంది.
News September 8, 2025
ఇకపై ప్రతి రోజూ తిరుపతి-షిర్డీ రైలు

AP: సీఎం చంద్రబాబు ప్రతిపాదన మేరకు ఇకపై ప్రతి రోజూ తిరుపతి-షిర్డీ మధ్య రైలు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 07637/07638 నంబర్ రైలు రేణిగుంట, కడప, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా ప్రయాణిస్తుంది. బ్రహ్మోత్సవాలు, పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రైలును రెగ్యులర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ రైలు టెంపరరీ సర్వీస్గా కొనసాగింది.