News July 23, 2024
నేను తప్పు చేసినా చర్యలు తీసుకోండి: పవన్

AP భవిష్యత్తు, పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి తాము పూర్తి సహకారం అందిస్తామని డిప్యూటీ CM పవన్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో ఖజానా ఖాళీ అయ్యింది. పోలవరం, అమరావతి ఆగిపోయాయి. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. ఎవరూ కక్ష సాధింపులకు పాల్పడవద్దు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 28, 2026
మరో రెండు LPG నౌకలు వచ్చేస్తున్నాయ్!

భారతీయ LPG నిల్వలకు మరింత బూస్ట్ ఇచ్చేందుకు పెట్రోలియం ఉత్పత్తులను మోసుకొస్తున్న మరో రెండు ఇంధన నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దృష్ట్యా వీటికి రక్షణగా భారత నౌకాదళ యుద్ధనౌకలు ఎస్కార్ట్ ఇవ్వనున్నాయి. దేశ ఇంధన అవసరాల కోసం త్వరలోనే మరిన్ని నౌకలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే మూడు LPG నౌకలు ఇండియాకు చేరాయి.
News March 28, 2026
జులైలో థియేటర్లలోకి ‘జన నాయకుడు’?

తమిళ స్టార్ నటుడు విజయ్, హెచ్ వినోద్ కాంబోలో తెరకెక్కిన ‘జన నాయకుడు’ సినిమా ఎట్టకేలకు రిలీజ్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో ఉండాల్సిన ఈ చిత్రం సెన్సార్ కాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే అన్ని అడ్డంకులను పూర్తిచేసి జులై నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిపై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నట్లు వెల్లడించాయి.
News March 28, 2026
వైసీపీ గైర్హాజరు.. జగన్ మదిలో ఏముంది?

AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చకూ వైసీపీ గైర్హాజరైంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సహా ఎమ్మెల్యేలు ఎవరూ సభకు రాలేదు. తమ పార్టీ, జగన్ అమరావతికి వ్యతిరేకం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పలు వేదికలపై స్పష్టం చేశారు. మరి ఇవాళ తీర్మానంపై చర్చకైనా ఆ పార్టీ ఎందుకు రాలేదనే చర్చ మొదలైంది. అమరావతికి జగన్ అనుకూలంగా లేరా? ఆయన మదిలో ఏముంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.


