News December 8, 2024
ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు

AP: భారీ వర్షాలతో ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జేసీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోత కోసిన వరిని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. కోత కోసిన వరిని రక్షించేందుకు టార్పాలిన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు వర్షాలు పడే సమయంలో పంట కోత కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News November 24, 2025
ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలపై అప్డేట్

APలో పంచాయతీ పాలక వర్గాలకు 2026 MAR వరకు గడువుండగా, MPTC, ZPTCల పదవీకాలం SEPతో ముగియనుంది. FEB, MARలో SSC, ఇంటర్ పరీక్షలు ఉండటంతో ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరగొచ్చు. పరిషత్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం SEP/OCTలో జరగొచ్చని అంచనా. కాగా రిజర్వేషన్ల ఖరారు కోసం వచ్చే నెలలో ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేయనుంది. అధ్యయనం, అభిప్రాయ సేకరణ అనంతరం కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారవుతాయి.
News November 24, 2025
ఇంట్లో శివలింగం ఉంటే.. ఈ నియమాలు తప్పనిసరి

ఎత్తైన శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠిస్తే కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు.
☛ లింగం నుంచి నిత్యం శక్తి విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి పైనుంచి చిన్న నీటి ప్రవాహమైనా ఉండాలి. ☛ రోజూ సాత్విక నైవేద్యం పెట్టాలి. ☛ ఇంట్లో మాంసాహారం వండకూడదు. ఇంట్లో వారెవరూ మద్యమాంసాలు ముట్టుకోకూడదు. ☛ ఓ ఇంట్లో 2 లింగాలను ప్రతిష్ఠించకూడదు. ☛ శివలింగం ఉన్న పూజా మందిరం పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలి.
News November 24, 2025
మహిళా అభివృద్ధి &శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు

TG:<


