News August 6, 2025
నిద్రపోయే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి!

వర్షాకాలంలో నిద్రపోయే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘నిద్రపోయే ముందు చల్లటి నీరు/పానియాలు తాగకూడదు. దానివల్ల దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాళ్లు పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు తడిగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావొచ్చు. గదిలో తేమ ఉంటే.. బ్యాక్టీరియా వృద్ధి చెంది అనారోగ్యాల బారిన పడొచ్చు. దోమకాటుకు కూడా గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు.
Similar News
News January 17, 2026
స్త్రీ ద్వేషులకు ప్రజలు బుద్ధి చెప్పారు: కంగనా

BMC <<18877157>>ఎన్నికల్లో<<>> మహాయుతి కూటమి గెలుపుపై నటి, MP కంగనా సంతోషం వ్యక్తం చేశారు. శివసేన(ఉద్ధవ్ వర్గం)కి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ‘స్త్రీ ద్వేషులు, బెదిరింపు రాజకీయాలు చేసేవాళ్లు, నెపోటిజం మాఫియాకి జనం తగిన స్థానాన్ని కట్టబెట్టారు. నా ఇంటిని అక్రమంగా కూల్చి మహారాష్ట్రను వదిలిపొమ్మని బెదిరించారు. ఇప్పుడు వాళ్లనే జనం వదిలేశారు’ అని పేర్కొన్నారు. 2020లో ఉద్ధవ్ హయాంలో అధికారులు కంగనా ఇంటిని కూల్చారు.
News January 17, 2026
ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్లోని <
News January 17, 2026
మెదడు ఇచ్చే ముందస్తు సంకేతం.. నెగ్లెక్ట్ చేయొద్దన్న వైద్యులు!

మెదడుకు రక్తప్రసరణ తాత్కాలికంగా నిలిచిపోవడాన్ని ‘మినీ స్ట్రోక్’ అంటారు. ఇది భవిష్యత్తులో రాబోయే భారీ స్ట్రోక్కు ముందస్తు హెచ్చరిక లాంటిదని ప్రముఖ వైద్యుడు సుధీర్ కుమార్ హెచ్చరించారు. మాట తడబడటం, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు నిమిషాల్లో తగ్గిపోయినా వాటిని నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. ఇవి కనిపిస్తే వెంటనే వైద్యుడిని కలవడం ద్వారా 80% వరకు మేజర్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చని సూచించారు.


