News October 27, 2024
రోజుకు 10000 STEPS వేస్తున్నారా?
ఫిట్నెస్ ట్రాకర్లు వచ్చాక రోజుకు ‘10000 STEPS’ టార్గెట్గా పెట్టుకోవడం అలవాటైంది. ఈ ట్రెండుపై కాస్త ఆలోచించాలని పరిశోధకులు అంటున్నారు. ఆయు ప్రమాణం పెరగాలంటే ‘10000’ అవసరమేమీ లేదంటున్నారు. శ్రద్ధగా రోజుకు 2300 అడుగులు వేసినా గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని అంటున్నారు. 3300 అడుగులేస్తే డెత్ రిస్క్ 15% తగ్గుతుందని, అదనంగా వేసే ప్రతి 500 స్టెప్స్కు 7% కార్డియో డెత్ రిస్క్ తగ్గుతుందని వెల్లడించారు.
Similar News
News October 27, 2024
కరెంట్ షాక్తో ‘యమరాజు’ కన్నుమూత
‘యమరాజు’గా పాపులర్ అయిన మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జవహార్సింగ్ యాదవ్ కన్నుమూశారు. తాను పెంచుకుంటున్న ఆవును మేపుతుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆ ఆవు కూడా మరణించింది. కాగా ఆయన కరోనా సమయంలో యమ ధర్మరాజు వేషధారణలో వాహనదారులకు అవగాహన కల్పించారు. అప్పట్లో ‘యమరాజు’ వినూత్న ఆలోచనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిశాయి.
News October 27, 2024
‘దీపావళి’ స్కామ్స్.. జాగ్రత్త
దీపావళి ముంగిట సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. భారీ ఆఫర్లంటూ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్ల లింకులు, APK ఫైళ్లను వాట్సాప్ నంబర్లకు పంపుతున్నారు. ఏదైనా వస్తువు కోసం డబ్బు చెల్లించినా డెలివరీ కావట్లేదు. వ్యక్తిగత సమాచారం దుండగుల చేతుల్లోకి వెళ్తోంది. అలాగే బంపర్ డ్రా, లాటరీల పేరుతోనూ స్కామ్లు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
News October 27, 2024
విశాఖలో ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్: లోకేశ్
AP ఆర్థిక రాజధాని విశాఖకు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్ రాబోతున్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. శాన్ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్పోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా సంస్థలు రాబోతున్నాయి. అమరావతిలో 5 బిలియన్ డాలర్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం’ అని ఆయన చెప్పారు.