News July 12, 2024

చికిత్స తీసుకుంటున్నా.. ఇండియాకు రాలేను: ప్రభాకర్ రావు

image

TG: ఫోన్ ట్యాపింగ్‌ కేసు విచారణకు తాను ఇండియా రావడం కుదరదని SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అధికారులకు చెప్పారు. గత నెల 23న ఆయన రాసిన లేఖ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. క్యాన్సర్, గుండె చికిత్సలు తీసుకుంటున్నానని అందులో తెలిపారు. ‘ట్యాపింగ్ కేసులో ఆరోపణల వల్ల నేను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇండియా వస్తాను. వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణకు సిద్ధం’ అని తెలిపారు.

Similar News

News December 2, 2025

వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

image

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల వివరాలను నేడు TTD విడుదల చేయనుంది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి 24 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1.8 లక్షల టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు ఇవాళ మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

News December 2, 2025

US, UK ఒప్పందం.. ఔషధాలపై ‘0’ టారిఫ్

image

అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. UK నుంచి USకు ఎగుమతి అయ్యే ఔషధాలపై సున్నా టారిఫ్‌లు అమలయ్యేలా ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి. దీనికి బదులుగా ఔషధాల ఆవిష్కరణలకు అమెరికాలో యూకే 25శాతం అధిక పెట్టుబడులు పెట్టనుంది. దీంతో అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. ఏటా కనీసం 5బిలియన్ డాలర్ల విలువైన UK ఔషధాలు టారిఫ్ లేకుండా USలోకి ఎగుమతి అవుతాయి.

News December 2, 2025

నేడు భౌమ ప్రదోషం.. శివానుగ్రహం కోసం ఈరోజు సాయంత్రం ఏం చేయాలంటే?

image

త్రయోదశి తిథి, మంగళవారం కలిసి వచ్చిన సందర్భంగా ఈరోజును ‘భౌమ ప్రదోషం’గా పరిగణిస్తారు. ఈ శుభ దినాన సాయంత్రం శివ పార్వతులను పూజిస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్లి, అభిషేకాలు నిర్వహిస్తే.. మనోభీష్టాలు నెరవేరతాయని నమ్మకం. బిల్వ, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు సమర్పించి, ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేష ఫలితాలుంటాయని అంటున్నారు.