News October 13, 2025

WBలో తాలిబన్ పాలన నడుస్తోంది: BJP, CPM

image

వైద్య విద్యార్థిని రేప్ ఘటనపై WB CM మమత వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అర్ధరాత్రి ఆమె బయటకు ఎలా వచ్చిందనడంపై నేతలు మండిపడుతున్నారు. ‘ఇక్కడ తాలిబన్ పాలన నడుస్తోంది. మహిళలు రాత్రివేళ బయటకు రావద్దా? వస్తే రేప్ చేస్తామంటారా?’ అని BJP MLA అగ్నిమిత్ర ప్రశ్నించారు. ‘స్త్రీలు పురుషులతో సమానం కాదా? వారి భద్రత ప్రభుత్వ బాధ్యత కాదా?’ అని CPM నిలదీసింది. కాగా తన కామెంట్లను మీడియా వక్రీకరించిందని మమత అన్నారు.

Similar News

News October 13, 2025

సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు హెల్త్ చెకప్‌లు: సీఎం రేవంత్

image

TG: సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ‘విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తేవాలి. భోజనం క్వాలిటీ చెక్‌ చేసేందుకు టెక్నాలజీ వాడాలి. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలి. హాస్టళ్లను మెడికల్ కాలేజీలు, CHCతో లింక్ చేయాలి’ అని సూచించారు.

News October 13, 2025

పాక్‌లో ఆగని అల్లర్లు

image

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా TLP చేపట్టిన ఆందోళనలతో పాకిస్థాన్ అట్టుడుకుతూనే ఉంది. లాహోర్‌లో పోలీసుల కాల్పుల్లో పదుల సంఖ్యలో మరణించగా నేడు కూడా ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపు వెళ్లేందుకు రోడ్లపై అడ్డంగా పెట్టిన షిప్పింగ్ కంటైనర్లను తొలగించబోయారు. దీన్ని అడ్డుకున్న పోలీసులపై వారు కాల్పులు జరిపినట్లు పంజాబ్ పోలీస్ చీఫ్ పేర్కొన్నారు. తాజా ఘర్షణల్లో పోలీసు అధికారితో సహ ఐదుగురు మరణించారు.

News October 13, 2025

సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదోన్నతుల కల్పనపై అధ్యయనం చేసేందుకు 10 మంది మినిస్టర్లతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, నారాయణ, DSBV స్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, గొట్టిపాటి రవి కుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.