News March 12, 2025
జగన్తో తమిళనాడు మినిస్టర్ భేటీ

AP: మాజీ సీఎం వైఎస్ జగన్తో తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ నెల 22న చెన్నైలో జరిగే దక్షిణ భారత అఖిలపక్ష నేతల సమావేశానికి హాజరుకావాలని జగన్ను కోరారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ రాసిన లేఖను ఆయనకు అందజేశారు. డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలను స్టాలిన్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 8, 2026
YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

AP: రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. అమరావతిపై <<18799615>>జగన్<<>> చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందనే చర్చ మొదలైంది. గతంలో తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనను ఈసారి అమలు చేస్తారనే టాక్ విన్పిస్తోంది. మరోవైపు అమరావతికి చట్టబద్ధత తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాగా ప్రభుత్వం మారితే APకి రాజధాని మారుతుందా?, శాశ్వత క్యాపిటల్ ఉండదా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
News January 8, 2026
సర్ఫరాజ్ రికార్డు.. 15 బాల్స్లో 50

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ VHTలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశారు. పంజాబ్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు దిగిన ఆయన 15బాల్స్లో 50 రన్స్ చేసి చరిత్ర సృష్టించారు. దూకుడుగా ఆడిన సర్ఫరాజ్ (62) అభిషేక్ శర్మ వేసిన ఒకే ఓవర్లో 6, 4, 6, 4, 6, 4 బాది 30 పరుగులు చేశారు. కాగా, ఈ మ్యాచ్లో ముంబై ఓడింది. ఇంతకుముందు ఈ రికార్డు బరోడా బ్యాటర్ అతీత్ శేఠ్ (16 బాల్స్లో 50) పేరున ఉంది.
News January 8, 2026
త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ: CM

TG: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నట్లు CM రేవంత్ తెలిపారు. సచివాలయంలో CMతో హిమాచల్ప్రదేశ్ మంత్రి రోహిత్ కుమార్ భేటీ అయ్యారు. ‘అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తాం. చిన్నారులను స్కూళ్లకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించే అంశంపై యోచిస్తున్నాం’ అని CM వివరించారు.


