News March 12, 2025

జగన్‌తో తమిళనాడు మినిస్టర్ భేటీ

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌తో తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ నెల 22న చెన్నైలో జరిగే దక్షిణ భారత అఖిలపక్ష నేతల సమావేశానికి హాజరుకావాలని జగన్‌ను కోరారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ రాసిన లేఖను ఆయనకు అందజేశారు. డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలను స్టాలిన్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 17, 2026

PHOTOS: HYDలో అబ్బురపరిచే హాట్ ఎయిర్ బెలూన్ షో

image

TG: హైదరాబాద్‌లో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 18 బెలూన్స్ గాల్లో సందడి చేస్తున్నాయి. గోల్కొండ వద్ద ఆకాశం నుంచి తీసిన ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. అటు ఇవాళ ఉదయం ఓ బెలూన్ సాంకేతిక సమస్యతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందన్న వార్తలను నిర్వాహకులు ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు.

News January 17, 2026

రాహుల్‌‌ను అవమానించానని ఫీలవుతున్నా: జగ్గారెడ్డి

image

TG: సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయనని PCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ‘గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సంగారెడ్డి వచ్చి నన్ను గెలిపించాలని కోరితే ఇక్కడివారు ఓడించారు. ఆయన్ను సంగారెడ్డికి పిలిచి అవమానించానేమోనని ఫీలవుతున్నాను. నా ఓటమికి కారణం పేదలు కాదు మేధావులు, పెద్దలే. అందుకే ఇకపై ఇక్కడ పోటీచేయదల్చుకోలేదు. నా భార్య ఇక్కడ పోటీ చేసినా ప్రచారం చేయను’ అని పార్టీ భేటీలో స్పష్టం చేశారు.

News January 17, 2026

బంగ్లాలో మరో హిందువు హత్య.. కారుతో ఢీకొట్టి..

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై <<18840974>>దారుణాలు<<>> ఆగడం లేదు. రాజ్‌బరి జిల్లాలో రిపోన్ సాహా(30) అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి చంపేశారు. BNP నేత అబుల్ హషేమ్ కారులో పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లబోయాడు. అడ్డుకునేందుకు యత్నించిన రిపోన్‌పైకి కారును ఎక్కించాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, హషేమ్, కారు డ్రైవర్ కమాల్ హొసైన్‌ను అరెస్టు చేశారు.