News June 4, 2024
తమిళి సై వెనుకంజ

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి ఎంపీగా పోటీచేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లోనూ ఆమె ఓటమి దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. డీఎంకే అభ్యర్థి సుమతి 6148 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఎంపీగా గెలుస్తాననే ధీమాతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. కాగా 2019లో డీఎంకే అభ్యర్థి తమిజాచి తంగపాండియన్ 2.62 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
Similar News
News September 19, 2025
కార్ల ధరలు తగ్గించిన మారుతి సుజుకీ

కొత్త GST రేట్ల నేపథ్యంలో మారుతి సుజుకి కార్ల ధరలను తగ్గించింది. S-ప్రెసోపై రూ.1,29,600, ఆల్టో K10పై రూ.1,07,600, సెలేరియోపై రూ.94,100, డిజైర్పై రూ.87,700, వ్యాగన్-Rపై రూ.79,600, ఇగ్నిస్పై రూ.71,300, స్విఫ్ట్పై రూ.84,600, బాలెనోపై రూ.86,100, ఫ్రాంక్స్పై రూ.1,12,600, బ్రెజ్జాపై రూ.1,12,700, గ్రాండ్ విటారాపై రూ.1,07,000, జిమ్నీపై రూ.51,900, ఎర్టిగాపై రూ.46,400 మేర ధరలు తగ్గించింది.
News September 19, 2025
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?

రోజులో చాలా ముఖ్యమైన మీల్ బ్రేక్ఫాస్ట్. కానీ, చాలామంది దానిని స్కిప్ చేస్తుంటారు. నైట్ ఎక్కువ తిన్నారనో, బరువు తగ్గాలనో కారణం ఏదైనా టిఫిన్ చేయడం మానేస్తారు. దాంతో మెదడుకు కావాల్సిన ఎనర్జీ దొరక్క ఏకాగ్రత లోపిస్తుంది. బ్లోటింగ్, అజీర్తి, గుండె సమస్యలు వస్తాయి. బరువు కూడా పెరుగుతారు. మరోవైపు టిఫిన్ ఆలస్యంగా చేస్తే ఆయుష్షు 8-10 శాతం తగ్గుతుందని మాంచెస్టర్ యూనివర్సిటీ స్టడీ చెబుతోంది. SHARE IT.
News September 19, 2025
నేడు ఒమన్తో భారత్ మ్యాచ్

ఆసియా కప్లో భారత్ ఆఖరి గ్రూప్ మ్యాచ్కి రెడీ అవుతోంది. నేడు దుబాయ్ వేదికగా ఒమన్తో SKY సేన తలపడనుంది. ఇప్పటికే PAK, UAEలపై గ్రాండ్ విక్టరీలు సాధించిన IND సూపర్-4కి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇవాళ్టి నామమాత్రపు మ్యాచును సూపర్-4కి ప్రాక్టీస్గా ఉపయోగించుకోనుంది. ఈమేరకు జట్టులో పలు మార్పులు చేసే ఛాన్సుంది. బుమ్రా, కుల్దీప్/వరుణ్లకు రెస్ట్ ఇచ్చే అవకాశముంది. మ్యాచ్ రా.8గంటలకు ప్రారంభమవుతుంది.