News April 5, 2024

YCP ఓటమి తర్వాత తాడేపల్లిలో టపాసులు కాల్చుతా: పృథ్వీ

image

AP: జగన్ వదిలిన బాణం పోటు 12 శాతం వైసీపీ ఓట్లపై ప్రభావం చూపుతుందని జనసేన నేత పృథ్వీ చెప్పారు. ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో సమావేశమైన ఆయన ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. తర్వాత మాట్లాడుతూ.. ‘ఈ నెల 18 నుంచి ప్రచారం చేస్తాం. 2019లో వైసీపీ విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చా. 2024లో ఆపార్టీ ఓటమి తర్వాత మళ్లీ అక్కడే కాల్చుతా’ అని పేర్కొన్నారు.

Similar News

News November 19, 2025

HEADLINES

image

* మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఎన్‌కౌంటర్
* ఏపీలో మావోయిస్టుల కలకలం.. 50 మందికిపైగా అరెస్ట్
* పుట్టపర్తి సత్యసాయి శత జయంతి సందర్భంగా రేపు ఏపీకి PM మోదీ
* డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం: TTD
* 2015 గ్రూప్-2 పరీక్ష ఫలితాలను రద్దు చేసిన TG హైకోర్టు
* TGలో వాట్సాప్‌లో ‘మీ-సేవ’లు ప్రారంభం
* భారీగా తగ్గిన బంగారం ధరలు

News November 19, 2025

టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

image

సున్నితమైన, రెచ్చగొట్టే కంటెంట్ ప్రసారంపై TV ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఎర్రకోట పేలుడు సహా ఇటీవలి ఘటనలకు సంబంధించిన సమాచార ప్రసారానికి దూరంగా ఉండాలని కోరింది. కొన్ని ఛానెళ్లు హింసను ప్రేరేపించేలా, శాంతికి భంగం కలిగించేలా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వీడియోలు టెలికాస్ట్ చేశాయని పేర్కొంది. ఇది చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించే దృశ్యాలను ప్రసారం చేయొద్దని సూచించింది.

News November 19, 2025

ఈ నెల 27న రాహుల్ పెళ్లి.. సీఎంకు ఆహ్వానం

image

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న ప్రియురాలు హరిణ్యతో ఆయన వివాహం జరగనుంది. కాబోయే దంపతులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి శుభలేఖ అందజేసి ఆహ్వానించారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్యా రెడ్డి. ఇక రాహుల్ పాడిన ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే.