News April 5, 2024

YCP ఓటమి తర్వాత తాడేపల్లిలో టపాసులు కాల్చుతా: పృథ్వీ

image

AP: జగన్ వదిలిన బాణం పోటు 12 శాతం వైసీపీ ఓట్లపై ప్రభావం చూపుతుందని జనసేన నేత పృథ్వీ చెప్పారు. ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో సమావేశమైన ఆయన ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. తర్వాత మాట్లాడుతూ.. ‘ఈ నెల 18 నుంచి ప్రచారం చేస్తాం. 2019లో వైసీపీ విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చా. 2024లో ఆపార్టీ ఓటమి తర్వాత మళ్లీ అక్కడే కాల్చుతా’ అని పేర్కొన్నారు.

Similar News

News October 23, 2025

ఉద్యోగ ఒత్తిడి ప్రాణాంతకం: ప్రొఫెసర్

image

దీర్ఘకాలిక ఉద్యోగ ఒత్తిడి, టాక్సిక్ ఆఫీస్ కల్చర్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించి, అకాల మరణానికి కూడా దారితీయవచ్చని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జెఫ్రీ పిఫెర్ హెచ్చరించారు. అధిక పని గంటలు, ఉద్యోగ భద్రత లేమి వంటి అంశాలు ఒత్తిడి సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. హానికరమైన ఉద్యోగంలో కొనసాగడం వ్యక్తి శ్రేయస్సుకు ప్రమాదమని ఈ అంశాన్ని ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించారు.

News October 23, 2025

పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

TG: టెన్త్ ఫైనల్‌ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు తేదీలను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్ ప్రకటించింది. OCT 30-NOV 13లోపు HMలకు ఫీజు చెల్లించాలని తెలిపింది. వాళ్లు ఆన్‌లైన్‌‌లో NOV 14లోపు ఫీజు చెల్లించాలని, విద్యార్థుల డేటాను నవంబర్‌ 18లోపు DEOలకు అందించాలని పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్‌ 29 వరకు, రూ.200తో DEC 2-11 వరకు, రూ.500 లేట్ ఫీజ్‌తో DEC 15-29 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.

News October 23, 2025

విశాఖ గ్రోత్ హబ్ పనులు మరింత వేగవంతం: CS

image

AP: విశాఖ గ్రోత్ హబ్, పూర్వోదయ పథకాలపై నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం సచివాలయంలో CS విజయానంద్‌తో భేటీ అయ్యారు. ఏపీలో ఓడరేవులున్నా ఒక కంటైనర్ మెగా పోర్టు అవసరముందని ఆయన సూచించారు. పూర్వోదయ స్కీమ్‌తో తీరప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. VSP గ్రోత్ హబ్ పనుల వేగవంతానికి ప్రత్యేకంగా ఇన్‌ఛార్జిని నియమించనున్నామని CS చెప్పారు. కేంద్రం నుంచి తగినన్ని నిధులు వచ్చేలా చూడాలని సీఈఓను కోరారు.