News April 5, 2024

YCP ఓటమి తర్వాత తాడేపల్లిలో టపాసులు కాల్చుతా: పృథ్వీ

image

AP: జగన్ వదిలిన బాణం పోటు 12 శాతం వైసీపీ ఓట్లపై ప్రభావం చూపుతుందని జనసేన నేత పృథ్వీ చెప్పారు. ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో సమావేశమైన ఆయన ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. తర్వాత మాట్లాడుతూ.. ‘ఈ నెల 18 నుంచి ప్రచారం చేస్తాం. 2019లో వైసీపీ విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చా. 2024లో ఆపార్టీ ఓటమి తర్వాత మళ్లీ అక్కడే కాల్చుతా’ అని పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

భక్తులకు ద్రోహం చేశారు: పవన్ కళ్యాణ్

image

AP: 2019-24 మధ్య తిరుమలకు వెళ్లిన భక్తులను మోసం చేశారని Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఐదేళ్లలో 20కోట్లకు పైగా కల్తీ లడ్డూలు తయారు చేశారని సిట్ తేల్చిందన్న కథనాలపై ఆయన స్పందించారు. ‘గత TTD బోర్డులోని అధికారులు భక్తులకు ద్రోహం చేశారు. మనం భక్తితో నమస్కరిస్తుంటే, వాళ్లు మన హృదయాలను ముక్కలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, మనం పెట్టుకున్న నమ్మకాన్ని కూడా తుంచేశారు’ అని ట్వీట్ చేశారు.

News November 24, 2025

బీజేపీతో పొత్తు.. కొట్టిపారేసిన ఒవైసీ

image

‘బీజేపీతో మజ్లిస్ పొత్తు’ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా వర్గాలు వక్రీకరించి తప్పుదోవ పట్టించాయన్నారు. ‘ఏ కూటమిలో చేరే ఆలోచన లేదు. బీజేపీ భాగస్వామ్యం ఉన్న ఏ సర్కారుకూ మద్దతివ్వం. అయితే సీమాంచల్‌(బిహార్)అభివృద్ధికి నితీశ్ ప్రభుత్వం కృషి చేస్తే సహకరిస్తాం’ అని స్పష్టం చేశారు. తమ పోరాటం ప్రజల హక్కుల కోసమేనని తేల్చి చెప్పారు.

News November 24, 2025

గులాబీలో చీడలను ఎలా నివారించవచ్చు?

image

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్‌ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.