News August 6, 2024
టార్గెట్ ఫైనల్స్.. నేడు జర్మనీతో భారత హాకీ జట్టు ఢీ

ఒలింపిక్స్లో సూపర్ ఫామ్తో దూసుకెళ్తున్న భారత హాకీ జట్టు నేడు జర్మనీతో సెమీఫైనల్స్లో తలపడనుంది. బలాబలాల పరంగా ఇరు జట్లు మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. ఫైనల్స్ లక్ష్యంతో హర్మన్ ప్రీత్ సేన ధీమాగా బరిలోకి దిగుతోంది.
కీలక డిఫెండర్ అమిత్ సస్పెన్షన్ వేటుతో దూరం కావడం భారత్కు కాస్త ఇబ్బంది కలిగించే అంశం. గెలిచిన జట్టు NED లేదా స్పెయిల్తో ఫైనల్లో తలపడుతుంది. చివరిగా 1980లో భారత జట్టు ఫైనల్ చేరింది.
Similar News
News March 11, 2026
గ్యాస్ బుక్ చేస్తున్నారా?

TG: గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. అందుకు నకిలీ LPG బుకింగ్ సైట్లను క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. త్వరగా సిలిండర్ సప్లై చేస్తామంటే నమ్మొద్దని, అది మోసమని గ్రహించాలని చెప్పారు. సిలిండర్ బుకింగ్ పేరిట అపరిచిత వ్యక్తులకు OTPలు చెప్పొద్దని సూచించారు. ఈ తరహా మోసాలకు గురైతే 1930కి వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.
News March 11, 2026
గూగుల్, అమెజాన్లపై ఇరాన్ గురి

US ఎంబసీలు, సైనిక స్థావరాలపైన దాడి చేస్తున్న ఇరాన్ ఇప్పుడు టెక్ కంపెనీలపైన ఫోకస్ పెట్టింది. USకు చెందిన క్లౌడ్, డేటా అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఇరాన్ కొత్త టార్గెట్ల జాబితాలో చేరాయని ఆ దేశ మీడియా తస్నిమ్ న్యూస్ తెలిపింది. దీంతో గల్ఫ్ సహా ఇజ్రాయెల్లోని అమెరికన్ టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఐబీఎమ్, ఒరాకిల్, పాలంటీర్ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
News March 11, 2026
గ్యాస్ కొరత.. హోటళ్లకు 2 రోజుల్లో ₹20 కోట్ల నష్టం

TG: రాష్ట్రంలో హోటళ్లపై గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 50 వేల హోటళ్లుండగా రోజూ ₹300 కోట్ల టర్నోవర్ జరుగుతుండగా, 2 రోజుల్లో ₹20 కోట్ల నష్టం జరిగింది. ఇక స్టాక్ సిలిండర్లు 2-3 రోజులకే ఉండటంతో ఈ నష్టం భారీగా పెరగనుందని హోటల్ యాజమాన్యాల ప్రతినిధి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే వాణిజ్య గ్యాస్ సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో మంత్రి ఉత్తమ్ చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


