News April 1, 2025
2029కి రూ.50వేల కోట్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: రాజ్నాథ్

FY2025లో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.23,622 కోట్లకు చేరినట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. FY24తో(రూ.21,083 కోట్లు) పోలిస్తే 12.04 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. ఈ విజయంలో భాగమైన అందరికీ అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంలో 2029 నాటికి రక్షణ ఎగుమతులను రూ.50వేల కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిఫెన్స్ రంగంలో ఇది గర్వించదగ్గ మైలురాయి అని PM కొనియాడారు.
Similar News
News April 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 3, 2025
BREAKING: వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 226 ఓట్లు, వ్యతిరేకంగా 163 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లుకు సునాయాసంగా ఆమోదం లభించింది. ఓటింగ్లో మొత్తం 390 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో ఒక సభ్యుడు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. 12 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
News April 3, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 3, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
ఇష: రాత్రి 7.43 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.