News April 1, 2025

2029కి రూ.50వేల కోట్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: రాజ్‌నాథ్

image

FY2025లో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.23,622 కోట్లకు చేరినట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. FY24తో(రూ.21,083 కోట్లు) పోలిస్తే 12.04 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. ఈ విజయంలో భాగమైన అందరికీ అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంలో 2029 నాటికి రక్షణ ఎగుమతులను రూ.50వేల కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిఫెన్స్ రంగంలో ఇది గర్వించదగ్గ మైలురాయి అని PM కొనియాడారు.

Similar News

News December 5, 2025

పెద్దపల్లి: పట్టాలపై కారు.. తప్పిన పెను ప్రమాదం

image

పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే గేటు వద్ద శుక్రవారం భారీ ప్రమాదం తప్పింది. గేటు ఒక్కసారిగా అకస్మాత్తుగా లాక్ అవ్వడంతో కారు పట్టాలపై నిలిచిపోయింది. రైలు హారన్ వినిపించడంతో కారులో ఉన్నవారితో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ట్రైన్ల రాకపోకలు నిలిపివేశారు. 30 నిమిషాల పాటు శ్రమించి గేటు మరమ్మతులు చేశారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పింది.

News December 5, 2025

ఈ కంటెంట్ ఇక నెట్‌ఫ్లిక్స్‌లో..

image

Warner Bros(WB)ను నెట్‌ఫ్లిక్స్ <<18481221>>సొంతం<<>> చేసుకోవడంతో విస్తృతమైన కంటెంట్‌ అందుబాటులోకి రానుంది. 2022 లెక్కల ప్రకారం WBలో 12,500 సినిమాలు, 2,400 టెలివిజన్ సిరీస్‌లు(1,50,000 ఎపిసోడ్లు) ఉన్నాయి. దాదాపు 1,45,000 గంటల కంటెంట్ ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది బిగ్ బ్యాంగ్ థియరీ, హ్యారీపొటర్, ది సోప్రానోస్, ఫ్రెండ్స్, ది మెంటలిస్ట్, సూపర్ న్యాచురల్, ది వైర్ లాంటి సూపర్ హిట్ సిరీస్‌లను WBనే నిర్మించింది.

News December 5, 2025

మోతాదు మించితే పారాసిటమాల్ ప్రమాదమే: వైద్యులు

image

సరైన మోతాదులో తీసుకుంటే పారాసిటమాల్ సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే అధిక మోతాదులో వాడటం వల్ల లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. ‘రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఆల్కహాల్‌ సేవించినప్పుడు & ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ మాత్రలు వేసుకోవద్దు. జలుబు/ఫ్లూ ట్యాబ్లెట్లలో కూడా పారాసిటమాల్ ఉంటుంది కాబట్టి రోజువారీ మోతాదును సరిచూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.