News April 24, 2024
తస్లిమా ఆస్తులు రూ.10 కోట్లు!

TG: గత నెల లంచం <<12905500>>తీసుకుంటూ<<>> దొరికిపోయిన మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. పలు ప్రాంతాల్లో భవనాలు, రూ.2.94 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటి మార్కెట్ విలువ రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. Sarwar ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు.
Similar News
News December 4, 2025
మోదీ, పుతిన్ చర్చించే అంశాలు ఇవే..

భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు <<18463791>>పుతిన్<<>> పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వాణిజ్యం, డిఫెన్స్ కోఆపరేషన్, ఆయిల్, న్యూక్లియర్ ఎనర్జీ, వర్కర్లపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైళ్లను నేలమట్టం చేసింది. వాటితో పాటు S-500లు, బ్రహ్మోస్ మిస్సైళ్లు, Su-57 ఫైటర్ జెట్ల కొనుగోళ్లపై ఒప్పందాలు జరగనున్నాయి.
News December 4, 2025
తొలి విడత.. ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్!

TG: రాష్ట్రంలో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థులకు తెలుగు అక్షర క్రమం ఆధారంగా EC గుర్తులు కేటాయించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి 30 మంది సర్పంచ్లు ఏకగ్రీవమైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. మొత్తంగా 400కుపైగా స్థానాలు ఏకగ్రీవమవుతాయని అంచనా వేశాయి. రెండో విడతలో 4,332 సర్పంచ్ స్థానాలకు 28,278 మంది, 38,342 వార్డు స్థానాలకు 93,595 మంది నామినేషన్లు వేసినట్లు సమాచారం.
News December 4, 2025
అమరావతిలో భూసమీకరణపై ప్రశ్నలు!

AP: రాజధాని అమరావతిలో భూసమీకరణపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో సేకరించిన 32వేల ఎకరాల్లో పనులు ఓ కొలిక్కి రాకముందే రెండో విడతలో 16వేల ఎకరాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మూడో విడత భూసేకరణ కోసం కసరత్తు చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గన్నవరంలో విమానాశ్రయం ఉండగా అమరావతిలో మరో ఎయిర్పోర్ట్ ఎందుకని అంటున్నారు. దీనిపై మీ COMMENT?


