News May 10, 2024
రూ.200కోట్లకు రాయల్టీ ఫీజు పెంచిన టాటా సన్స్

టాటా గ్రూప్ను పర్యవేక్షించే టాటా సన్స్ తమ బ్రాండ్ పేరు వాడుకుంటున్న TCS, టాటా స్టీల్ తదితర సంస్థలకు రాయల్టీ ఫీజును పెంచింది. 2019లో రూ.100కోట్లుగా ఉన్న ఈ రాయల్టీ ఫీజును ఇప్పుడు డబుల్ చేసి ఇకపై రూ.200కోట్లు చెల్లించాలని పేర్కొంది. 1996లో రతన్ టాటా తొలిసారిగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దీనిపై షేర్ హోల్డర్లలో వ్యతిరేకత వ్యక్తమైనా ఇది టాటా బ్రాండ్ ప్రమోషన్ కోసమేనని అప్పట్లో రతన్ టాటా వివరణ ఇచ్చారు.
Similar News
News March 27, 2026
విజయ్, త్రిష రిలేషన్.. సముద్రఖని ఏమన్నారంటే?

TVK చీఫ్ విజయ్, త్రిష కలిసి రిసెప్షన్కు హాజరవడంపై తాను చేసిన కామెంట్లను నటుడు, డైరెక్టర్ సముద్రఖని సమర్థించుకున్నారు. ‘రాజకీయాల్లో విజయ్ను తొలుత సపోర్ట్ చేసింది నేనే. అందుకే నా బాధను వ్యక్తం చేశా. వీడియో తీస్తున్న వ్యక్తి నా మాటలను మధ్యలో రికార్డ్ చేశాడు’ అని పేర్కొన్నారు. వారి రిలేషన్ గురించి గతంలో సముద్రఖని మాట్లాడుతూ ‘ఇదేమైనా ఆటా? వ్యక్తిగత విషయాలు అందరికీ తెలియాలా?’ అంటూ మండిపడ్డారు.
News March 27, 2026
ఇన్ఫెక్షన్లతో గుండెపోటు.. వైద్యుల సలహా ఇదే!

రక్తపరీక్షలు సాధారణంగా ఉన్నా, స్వల్పకాలిక ఇన్ఫెక్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఇవి శరీరంలో వాపును పెంచి, రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. దీనివల్ల ధమనుల్లోని ప్లాక్ పగిలి ఆకస్మిక గుండెపోటుకు దారితీయొచ్చు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కఠినమైన వ్యాయామాలు చేయకండి. నోటి పరిశుభ్రత పాటించండి. గుండె ఆరోగ్యం కోసం అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడమూ ముఖ్యమే’ అని సూచిస్తున్నారు.
News March 27, 2026
రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంపు

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను కేంద్ర ప్రభుత్వం 50% నుంచి 70%కి పెంచింది. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ లేఖలు రాసింది. ఉక్కు, రసాయనాలు, ఆటో మొబైల్స్, వస్త్రాలు, రంగుల వంటి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రీ క్రైసిస్ కోటాను 40% నుంచి 50%కి పెంచింది. మరోవైపు దేశంలో యూరియా కొరత లేదని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.


