News November 17, 2024
తమిళనాడులో టాటాకు చెందిన ఐఫోన్ ఫ్యాక్టరీ

తమిళనాడులో ఐఫోన్ ప్లాంట్ కోసం తైవాన్కు చెందిన పెగట్రాన్తో టాటా సీల్స్ ఒప్పందం చేసుకుంది. ఐఫోన్ ప్లాంట్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ అంగీకరించింది. 10,000 మంది ఉద్యోగులున్న ఈ ప్లాంట్లో టాటా 60% & పెగట్రాన్ 40% వాటాను కలిగి ఉన్నాయి. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 5 మిలియన్ ఐఫోన్లను ఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో టాటాకు చెందిన మూడో ఐఫోన్ ఫ్యాక్టరీ ఇది.
Similar News
News November 26, 2025
నల్గొండ: పంచాయతీ ఎన్నికలపై సన్నద్ధత

నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.


