News July 11, 2024
ట్యాక్స్ వివాదం.. ₹50వేలు కడితే ₹1 వచ్చింది!

ఢిల్లీకి చెందిన అపూర్వ జైన్కు ఇన్కం ట్యాక్స్ నుంచి నోటీసులు రావడంతో CAను సంప్రదించారు. వివాదం పరిష్కరించేందుకు ₹50వేలు ఫీజు చెల్లించారు. రూ.లక్షల్లో పరిహారం వస్తుందనుకుంటే చివరికి ₹1 మాత్రమే దక్కింది. తీవ్ర నిరాశకు గురై విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న జైన్ ‘నేను జోక్ చేయట్లేదు’ అని రాసుకొచ్చారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. CA అంత ఛార్జ్ చేయకుండా ఉండాల్సిందని కొందరు అంటున్నారు.
Similar News
News November 26, 2025
APPLY NOW: BECILలో ఉద్యోగాలు

బ్రాడ్కాస్ట్ ఇంజినీర్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 18 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 7వరకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఇంటర్, PG, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి.
News November 26, 2025
రేవంత్ రూ.50వేల కోట్ల విద్యుత్ స్కాం: హరీశ్రావు

TG: CM రేవంత్ మరో అతిపెద్ద పవర్ స్కాంకు రూపకల్పన చేశారని, ఇది అక్షరాల రూ.50వేల కోట్ల కుంభకోణం అని హరీశ్రావు ఆరోపించారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని, కమీషన్ల కక్కుర్తికి మాస్టర్ ప్లాన్ వేశారని మీడియా సమావేశంలో తెలిపారు. ఒక్కో యూనిట్కు రూ.7.92 ఖర్చు చేయబోతున్నారని, ఇది ఎవరి ప్రయోజనం కోసం అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ కోసమే కొత్త డిస్కం తెస్తున్నారని విమర్శించారు.
News November 26, 2025
ఈ రెస్టారెంట్లో సింగిల్స్కు నో ఎంట్రీ!

దక్షిణ కొరియాలోని యోసు సిటీలోని ఓ రెస్టారెంట్ ఒంటరిగా వచ్చే వారికి అనుమతి లేదని ప్రకటించడం వివాదానికి దారితీసింది. సింగిల్ కస్టమర్లు ఇద్దరికి భోజనం కొనాలని లేదా ఫ్రెండ్/భార్యతో రావాలంటూ నిబంధనలు పెట్టింది. కొంతకాలంగా కొరియాలో “హోన్బాప్” అనే పేరుతో ఒంటరిగా తినే ట్రెండ్ పెరుగుతోంది. ఒంటరిగా తినడం ఒంటరితనం కాదని పలువురు అభిప్రాయపడుతుండగా, కొందరు ఈ నిర్ణయాన్ని సపోర్టు చేస్తున్నారు.


