News November 27, 2024
నేడు మోదీతో టీబీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ

తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇవాళ ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ కానున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వీరంతా ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ప్రజాప్రతినిధులు మోదీతో చర్చించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఆయన వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
Similar News
News December 7, 2025
ఆ మాట అనకుండా ఉండాల్సింది: SA కోచ్

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత ఆ టీమ్ హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ వాడిన గ్రోవెల్(సాష్టాంగం పడటం) పదంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్లో ఓటమి తర్వాత ఆ కాంట్రవర్సీపై ఆయన స్పందించారు. ‘తప్పుడు ఉద్దేశంతో ఆ మాట అనలేదు. ఇంకా బెటర్ వర్డ్ ఎంచుకుని ఉండాల్సింది. భారత్ మైదానంలో ఎక్కువసేపు గడిపి ఉండాల్సింది అన్న ఉద్దేశంలో అలా అన్నాను. వినయమే SA టెస్టు టీమ్ పునాది’ అని తెలిపారు.
News December 7, 2025
నావల్ డాక్యార్డ్లో 320 పోస్టులు

విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్ 320 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు జనవరి 2వరకు అప్లై చేసుకోవచ్చు. NAPS పోర్టల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/
News December 7, 2025
మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

☛ మొక్కజొన్న (సంకర రకాలు)- 90% ☛ శనగ- 85% ☛ వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)- 80% ☛ జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద – 75% ☛ ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు – 70% ☛ పత్తి, బెండ, కాలిఫ్లవర్ – 65% ☛ మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర- 60%. 100 విత్తనాలకు పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.


