News October 10, 2024
Q2 ఆదాయంపై ప్రెస్మీట్ రద్దు చేసిన TCS
రతన్ టాటా కన్నుమూయడంతో తమ ద్వితీయ త్రైమాసిక ఆదాయాన్ని వివరించేందుకు నిర్వహించాల్సిన ప్రెస్మీట్ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) రద్దు చేసింది. ఈ రోజు సాయంత్రం ఈ సమావేశం జరగాల్సి ఉండగా, అదే సమయానికి రతన్ అంత్యక్రియలు జరగనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. బోర్డు మీటింగ్ అనంతరం తమ జులై-సెప్టెంబరు పద్దును స్టాక్ ఎక్స్ఛేంజీకి వివరిస్తామని పేర్కొన్నాయి.
Similar News
News October 10, 2024
టాటా రిక్వెస్ట్: మూడు రోజుల్లో పరిష్కరించిన మోదీ
2008లో బెంగాల్ నుంచి పరిశ్రమలు తరలించాల్సి వచ్చినప్పుడు PM మోదీ 3 రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించారని రతన్ టాటా గతంలో గుర్తు చేసుకున్నారు. అప్పటి గుజరాత్ CMగా ఉన్న మోదీ తమను ఆహ్వానించారని, స్థలం కేటాయిస్తే తప్పక వస్తామని చెప్పామన్నారు. అప్పుడు 3 రోజుల్లో స్థలం కేటాయిస్తామని చెప్పి మోదీ మాట నిలుపుకున్నారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం కోసం ఆయన నిజాయితీగా పనిచేశారన్నారు.
News October 10, 2024
బ్రూక్&రూట్.. WORLD RECORD
పాక్తో తొలి టెస్టులో అదరగొట్టిన బ్రూక్(317), రూట్(262) వరల్డ్ రికార్డ్ సాధించారు. విదేశీ గడ్డపై ఏ వికెట్కైనా అత్యధిక పార్ట్నర్షిప్(454) నమోదు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. 1934లో బ్రాడ్మన్&పోన్స్ఫోర్డ్(AUS) ఇంగ్లండ్పై 451 స్కోర్ చేయగా, 90 ఏళ్లకు ఆ రికార్డును బ్రూక్&రూట్ బద్దలుకొట్టారు. 3,4,5 స్థానాల్లో అటపట్టు&సంగక్కర 438(vsZIM), జయవర్దనే&సమరవీర 437(vsPAK), డిప్పెనార్&రుడాల్ఫ్(vsBAN) ఉన్నారు.
News October 10, 2024
రూ.500 కోట్ల విరాళాలు ఏం చేశారు?: అవినాశ్
AP: వరద బాధితులందరికీ తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలంటూ NTR(D) YCP అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో VJAలో నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు వల్లే బుడమేరు వరదలు వచ్చాయని అవినాశ్ ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద పరిహారం కోసం బాధితులు పడిగాపులు కాస్తున్నారన్నారు. రూ.500 కోట్ల విరాళాలు ఏం చేశారని ప్రశ్నించారు. తమకు కావాల్సిన వారికే కూటమి నేతలు పరిహారం ఇచ్చారని, అర్హులను గాలికొదిలేశారని మండిపడ్డారు.