News April 15, 2025
TCSలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు!

ఈ ఆర్థిక సంవత్సరంలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని టీసీఎస్ నిర్ణయించినట్లు సమాచారం. 2024-25 మాదిరిగానే రిక్రూట్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. నేషనల్ క్వాలిఫయర్ టెస్టులో ప్రతిభ చూపిన వారిని ప్రైమ్, డిజిటల్, నింజా విభాగాల్లో నియమించుకోనుంది. కాగా FY2024-25 చివరికి 6,07,979 మంది ఉద్యోగులు TCSలో ఉన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6,433 మంది మాత్రమే పెరిగారు.
Similar News
News April 16, 2025
30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

APలోని 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో టీడీపీ నుంచి 25, జనసేన నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఒకరికి పదవులు దక్కాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
News April 16, 2025
స్మితా సబర్వాల్కు నోటీసులు.. మంత్రి ఏమన్నారంటే?

TG: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. IAS అధికారిణి <<16116901>>స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై<<>> చట్ట ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. BJP నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే కంచ భూములపై మోదీ మాట్లాడారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ, BRS కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వం కూలగొడితే కూలిపోయేది కాదని పేర్కొన్నారు.
News April 16, 2025
IPL: ఒకే ఓవర్లో 4, 4, 6, 4, 4

రాజస్థాన్పై ఢిల్లీ ఓపెనర్ అభిషేక్ పోరెల్ విధ్వంసం సృష్టిస్తున్నారు. దేశ్పాండే వేసిన రెండో ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 4 బౌండరీలు బాదారు. చివరి బంతికి సింగిల్ తీయడంతో ఆ ఓవర్లో మొత్తం 23 రన్స్ వచ్చాయి.