News September 20, 2024
బ్రాండ్ విలువలో TCS మరోసారి నంబర్-1

దేశంలో అత్యంత విలువైన బ్రాండ్గా TCS వరుసగా మూడో ఏడాది గుర్తింపు పొందింది. $49.7 బిలియన్ల విలువతో అగ్రస్థానంలో నిలిచినట్లు Kantar BrandZ రిపోర్ట్ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో HDFC బ్యాంక్($38.3bn), ఎయిర్టెల్($29.86bn), ఇన్ఫోసిస్($25.22bn), SBI($17.98bn), ICICI బ్యాంక్($15.60bn), జియో($13.74bn), ఏషియన్ పెయింట్స్($13.56bn), HCL టెక్($11.82bn), LIC($11.50bn) ఉన్నాయి.
Similar News
News December 9, 2025
విశాఖ: పలు రైళ్లు రద్దు.. మరికొన్ని కుదింపు

భద్రతా పనుల కారణంగా కేకే లైన్లో పలు రైళ్లను నియంత్రిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం పవన్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 9, 10వ తేదీల్లో విశాఖ-కిరండూల్, హీరాఖండ్, రూర్కెలా ఎక్స్ప్రెస్ కోరాపుట్ లేదా దంతెవాడ వరకే నడుస్తాయి. అదేవిధంగా డిసెంబర్ 13, 15వ తేదీల్లో విశాఖ-కిరండూల్ పాసింజర్ రైలు విశాఖపట్నం-కోరాపుట్ మధ్య రద్దు చేయబడింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి.
News December 9, 2025
ట్రెండ్ను ఫాలో అవుతున్న అభ్యర్థులు.. SMలో జోరుగా ప్రచారం!

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఈసారి కొత్త ఒరవడి కనిపిస్తోంది. అభ్యర్థులు ప్రజాక్షేత్రంతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. MLA ఎన్నికల మాదిరిగా ప్రత్యేక పాటలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటివరకూ ఊర్లో ఉంటూ రీల్స్ చేసే యువ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా పోటీలో ఉండటం విశేషం. దీంతో పోటీదారులు సంప్రదాయ రాజకీయాలను పక్కనపెట్టి కొత్త ట్రెండ్కు తెరలేపారు. వీరు యువతను ఆకర్షించేందుకే మొగ్గుచూపుతున్నారు.
News December 9, 2025
డిజిటల్గా జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

జనగణన-2027ను డిజిటల్గా చేపట్టనున్నట్లు కేంద్రం లోక్సభలో వెల్లడించింది. ‘మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరిస్తాం. ప్రజలు వెబ్ పోర్టల్ ద్వారా స్వయంగా వివరాలు అందించే అవకాశం కల్పిస్తాం. ప్రతి ఒక్కరి వివరాలను ప్రస్తుతం వారు నివసిస్తున్న చోటే సేకరిస్తాం. వారు జన్మించిన ప్రాంతం, గతంలో నివసించిన చోటు నుంచి కూడా డేటా తీసుకుంటాం. వలసలకు కారణాలు తెలుసుకుంటాం’ అని వివరించింది. జనగణన <<18451693>>రెండు దశల్లో<<>> జరగనుంది.


