News July 12, 2024

వేరియబుల్ పేను అటెండెన్స్‌కు లింక్ చేసిన TCS

image

వర్క్ ఫ్రమ్ హోమ్‌ వదిలి ఆఫీసుకు రావాలని TCS ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించినా ఇంకా చాలా మంది రావట్లేదు. ఈక్రమంలో వేరియబుల్ పేను అంటెండెన్స్‌కు లింక్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 70శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నట్లు చీఫ్ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉంటేనే పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందుతారు. 60% కంటే తక్కువ హాజరు ఉంటే బోనసే రాదు.

Similar News

News February 8, 2026

జీడిమామిడిలో ‘టి దోమ’ను ఎలా నివారించాలి?

image

చెట్లు చిగురించినప్పుడు తొలిసారి లీటరు నీటికి ల్యాండా సైహాలోత్రిన్ 0.6ML లేదా ఎసిటామాప్రిడ్ 0.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. 2,3 వారాల తర్వాత లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.6ML లేదా ప్రొఫెనోఫాస్ 1.5ML కలిపి పిచికారీ చేయాలి. కాయలు గోళీకాయ సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి ల్యాండా సైహాలోత్రిన్ 0.6ML లేదా ప్రొఫెనోఫాస్ 1.5ML కలిపి పిచికారీ చేయాలి. వీటికి వేపనూనెను తగిన మోతాదులో కలిపితే మంచిది.

News February 8, 2026

ఉదయమా? సాయంత్రమా? ఎక్సర్‌సైజ్‌కు బెస్ట్ టైమ్ ఏది?

image

ఎక్సర్‌సైజ్ ఏ టైమ్‌లో చేసినా మంచిదే. కానీ చేసే సమయాన్ని బట్టి ఫలితాల్లో మార్పు ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. సాయంత్రం 4-8 గంటల మధ్య కండరాల సామర్థ్యం పీక్‌లో ఉండి బెస్ట్ పెర్ఫార్మెన్స్‌కు వీలవుతుంది. స్త్రీలు ఉదయం పూట వర్కవుట్ చేస్తే పొట్ట కొవ్వు, BP తగ్గుతాయి. అదే పురుషులకు సాయంత్రం వేళ వ్యాయామం వల్ల BP కంట్రోల్‌లో ఉంటుంది. అయితే రోజూ ఒకే సమయంలో ఎక్సర్‌సైజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.

News February 8, 2026

మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు: భట్టి

image

TG: త్వరలో మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం 4.50 లక్షల గృహాలు నిర్మించామని చెప్పారు. స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు, లేని వారికి జీ+2 తరహాలో నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని అన్నారు.