News July 12, 2024
వేరియబుల్ పేను అటెండెన్స్కు లింక్ చేసిన TCS

వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి ఆఫీసుకు రావాలని TCS ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించినా ఇంకా చాలా మంది రావట్లేదు. ఈక్రమంలో వేరియబుల్ పేను అంటెండెన్స్కు లింక్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 70శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నట్లు చీఫ్ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉంటేనే పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందుతారు. 60% కంటే తక్కువ హాజరు ఉంటే బోనసే రాదు.
Similar News
News February 6, 2026
ఏపీ దళిత ఎంపీని కాంగ్రెస్ అవమానించింది: మోదీ

లోక్సభ స్పీకర్ ఛైర్లో కూర్చున్న ఏపీకి చెందిన దళిత ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ను కాంగ్రెస్ సభ్యులు అవమానించారని PM మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు కృష్ణప్రసాద్పై కాగితాలు విసిరేశారని మండిపడ్డారు. అలాగే అస్సాంకు చెందిన BJP MP దిలీప్ సైకియా అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడూ ఇలాగే ప్రవర్తించారని దుయ్యబట్టారు. వారికి దళితులపై చిన్నచూపు ఉందన్నారు.
News February 6, 2026
ఏపీకి రూ.40 వేల కోట్లు.. తెలంగాణకు రూ.23 వేల కోట్లు

గత ఐదేళ్లలో జాతీయ రహదారుల విస్తరణ, నిర్వహణ కోసం తెలంగాణకు రూ.23,668 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.40,345 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. TGకు 1,854 కిలోమీటర్ల మేర 84 హైవే ప్రాజెక్టులు మంజూరు కాగా, వాటిలో 39 నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఏపీలో 3,633 కిలోమీటర్ల మేర 145 ప్రాజెక్టులు చేపట్టగా, 69 పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
News February 6, 2026
కార్మికులకు శుభవార్త

AP: రాష్ట్రంలోని అసంఘటిత రంగంలోని 20L మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచడంపై దృష్టిపెట్టాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని సూచించారు. ప్రసూతికి ₹20వేలు, వివాహానికి ₹40వేలు, సహజ మరణానికి ₹60వేలు, అంత్యక్రియలకు ₹20వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు కల్పించాలని పేర్కొన్నారు.


