News July 12, 2024
వేరియబుల్ పేను అటెండెన్స్కు లింక్ చేసిన TCS

వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి ఆఫీసుకు రావాలని TCS ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించినా ఇంకా చాలా మంది రావట్లేదు. ఈక్రమంలో వేరియబుల్ పేను అంటెండెన్స్కు లింక్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 70శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నట్లు చీఫ్ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉంటేనే పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందుతారు. 60% కంటే తక్కువ హాజరు ఉంటే బోనసే రాదు.
Similar News
News February 6, 2026
ప్రెగ్నెన్సీలో అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

థైరాయిడ్ గ్రంథి పనితీరుకు, శారీరక, మానసిక అభివృద్ధికి అయోడిన్ ఎంతో ముఖ్యం. గర్భిణుల్లో అయోడిన్ లోపం ఉంటే గర్భస్రావం, వికలాంగ శిశువు, మరుగుజ్జు, చెవి, కంటి సమస్యలు, నత్తి, మానసిక, ఎదుగుదల లోపాలు వంటివి కనిపిస్తాయంటున్నారు నిపుణులు. పాలు, ఎండుద్రాక్ష, పెరుగు, బ్రౌన్ రైస్, చేపలు, ఉప్పు, కాడ్ లివర్ ఆయిల్, మాంసం, గుడ్లు, ఆకుకూరలు, మిల్లెట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News February 6, 2026
పాక్లో బాంబు దాడి.. 69కి చేరిన మృతులు

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన <<19067266>>సూసైడ్ బాంబింగ్లో<<>> మృతుల సంఖ్య 69కి చేరింది. మరో 170 మంది తీవ్రంగా గాయపడ్డట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దాడికి అఫ్గానిస్థానే కారణమని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాకుతో ఆ దేశంపై దాడి చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దాడికి తామే బాధ్యులమంటూ ఏ సంస్థ/వ్యక్తి ప్రకటించలేదు.
News February 6, 2026
తెలంగాణలో పవన్ ప్రచారం రద్దు

TG: రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దైంది. అనివార్య కారణాలతో ప్రచారం రద్దు చేసుకున్నట్టు జనసేన ప్రకటించింది. రేపు, ఎల్లుండి జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.


