News July 12, 2024
వేరియబుల్ పేను అటెండెన్స్కు లింక్ చేసిన TCS

వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి ఆఫీసుకు రావాలని TCS ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించినా ఇంకా చాలా మంది రావట్లేదు. ఈక్రమంలో వేరియబుల్ పేను అంటెండెన్స్కు లింక్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 70శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నట్లు చీఫ్ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉంటేనే పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందుతారు. 60% కంటే తక్కువ హాజరు ఉంటే బోనసే రాదు.
Similar News
News February 4, 2026
భావ వ్యక్తీకరణకు మూలం ‘విశుద్ధ చక్రం’

గొంతు భాగంలో ఉండే ఈ చక్రం భావ వ్యక్తీకరణకు మూలం. ఇది సరిగ్గా ఉన్నప్పుడు మాటలో స్పష్టత, సత్యాన్ని పలికే ధైర్యం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లభిస్తాయి. అస్థిరంగా ఉంటే గొంతు నొప్పి, థైరాయిడ్ సమస్యలు, ఇతరులతో మాట్లాడటానికి భయం కలుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘హం’ మంత్రాన్ని పఠించాలి. ఆకాశం వైపు చూస్తూ ధ్యానం చేయడం, సంగీతం వినడం, పాటలు పాడటం ద్వారా ఈ చక్రంలోని అడ్డంకులను తొలగించుకోవచ్చు.
News February 4, 2026
ఇలాంటి భారత జట్టును గతంలో ఎప్పుడూ చూడలేదు: ధోని

టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు భారత జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి భయంకరమైన జట్టును తాను గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ఎలాంటి సమయంలోనైనా ఒత్తిడిని జయించ గల జట్టుగా టీమిండియా తయారైందని, ఇదే ఊపు కొనసాగిస్తే కచ్చితంగా భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 4, 2026
మున్సిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది

TG: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. మొత్తంగా 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు SEC తెలిపింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో 2,996 వార్డులు, డివిజన్లకు ఎలక్షన్ జరగనుంది. దీంతో ప్రతి వార్డుకు సగటున నలుగురు అభ్యర్థుల చొప్పున పోటీ పడుతున్నారు. ఈ నెల 9తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. 11న పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడిస్తారు.


