News July 12, 2024
వేరియబుల్ పేను అటెండెన్స్కు లింక్ చేసిన TCS

వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి ఆఫీసుకు రావాలని TCS ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించినా ఇంకా చాలా మంది రావట్లేదు. ఈక్రమంలో వేరియబుల్ పేను అంటెండెన్స్కు లింక్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 70శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నట్లు చీఫ్ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉంటేనే పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందుతారు. 60% కంటే తక్కువ హాజరు ఉంటే బోనసే రాదు.
Similar News
News February 5, 2026
నీటి సంఘాలకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం: CM

AP: అనుమతి తీసుకోని ‘రాయలసీమ’ లిఫ్ట్ను NGT ఆపేస్తే దానిద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు YCP యత్నిస్తోందని CM CBN విమర్శించారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా తాము నీళ్లిస్తామని చెప్పారు. ‘గోదావరి నీరు వృథాగా పోతోంది. అందులోని 200 TMCలు నల్లమలసాగర్కు తరలిస్తాం. 2014-19 మధ్య నీటి సంఘాలు చేపట్టిన పనులకు గత GOVT బిల్లులు ఇవ్వలేదు. వాటిని చెల్లిస్తాం. ఇకపై పనులు వాటికే ఇస్తాం’ అని CM తెలిపారు.
News February 5, 2026
సకల విద్యల ఆదిగురువు ‘శివుడు’

ఈ జగత్తు శివమయం. ఆయన తన డమరుకనాథంతో భాషకు మూలమైన 14 మహేశ్వర సూత్రాలను సృష్టించాడు. అందుకే ఆయన ఆద్యంతరహితుడు. యోగ విద్యను జగత్తుకు అందించి, సప్తస్వరాలతో సంగీతానికి, తాండవంతో నృత్యానికి ప్రాణం పోశారు. అర్ధనారీశ్వర తత్వంతో స్త్రీ గౌరవాన్ని, నిరాడంబర జీవనంతో ఆధ్యాత్మికతను చాటిచెప్పారు. కులగోత్రాల భేదం లేని శివగోత్రంతో సామాజిక సమరసతను బోధించిన ఆయన సగుణ నిర్గుణ తత్వానికి ప్రతీకగా నిలిచిన విశ్వగురువు.
News February 5, 2026
చిన్నపిల్లలకు కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే?

ప్రస్తుత కాలంలో చిన్నవయసులోనే ఎన్నో రోగాలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో కూడా ఈ మధ్య కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తిస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలు నీరు ఎక్కువగా తాగడంతో పాటు హైసోడియం ఉన్న ఫుడ్స్ తినకుండా చూడాలి. అలాగే పిల్లలు ఎత్తుకు తగిన బరువుండేలా చూసుకోవాలి. ఫ్యామిలీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


