News July 12, 2024

వేరియబుల్ పేను అటెండెన్స్‌కు లింక్ చేసిన TCS

image

వర్క్ ఫ్రమ్ హోమ్‌ వదిలి ఆఫీసుకు రావాలని TCS ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించినా ఇంకా చాలా మంది రావట్లేదు. ఈక్రమంలో వేరియబుల్ పేను అంటెండెన్స్‌కు లింక్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 70శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నట్లు చీఫ్ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉంటేనే పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందుతారు. 60% కంటే తక్కువ హాజరు ఉంటే బోనసే రాదు.

Similar News

News December 11, 2025

సిరిసిల్ల: తొలి 2 గంటల్లో 17.46% పోలింగ్

image

జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఐదు మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 17.46 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చందుర్తిలో 14.75 శాతం, కోనరావుపేటలో 17.81 శాతం, రుద్రంగిలో 18.20 శాతం, వేములవాడలో 19.85 శాతం, వేములవాడ రూరల్లో 18.03 శాతం పోలింగ్ రికార్డైనట్లు వెల్లడించారు. వేములవాడ అర్బన్ మండలంలో అత్యధిక పోలింగ్, చందుర్తి మండలంలో అత్యల్ప పోలింగ్ నమోదయింది.

News December 11, 2025

ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఉడిపి<<>> కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 13పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మాజీ నేవీ సిబ్బంది జనవరి 6న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా(మెకానికల్/మెరైన్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. కమిషనింగ్ ఇంజినీర్‌కు నెలకు రూ.50వేలు, కమిషనింగ్ అసిస్టెంట్‌కు రూ.48వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://udupicsl.com

News December 11, 2025

తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేటు!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 110 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.100 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,09,000గా ఉంది. సిల్వర్ రేటు నాలుగు రోజుల్లోనే రూ.13,100 పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.