News July 12, 2024

వేరియబుల్ పేను అటెండెన్స్‌కు లింక్ చేసిన TCS

image

వర్క్ ఫ్రమ్ హోమ్‌ వదిలి ఆఫీసుకు రావాలని TCS ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించినా ఇంకా చాలా మంది రావట్లేదు. ఈక్రమంలో వేరియబుల్ పేను అంటెండెన్స్‌కు లింక్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 70శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నట్లు చీఫ్ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉంటేనే పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందుతారు. 60% కంటే తక్కువ హాజరు ఉంటే బోనసే రాదు.

Similar News

News February 1, 2026

ఫోన్ ట్యాపింగ్: అధికారులతో మొదలై కేసీఆర్ వరకు..

image

TG: రెండేళ్లుగా కొనసాగుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తొలుత SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అధికారులను విచారించి, అరెస్టు చేసిన సిట్.. ఆ తర్వాత నాయకులపై ఫోకస్ పెట్టింది. పలువురిని సాక్షులుగా, ఇంకొందరిని నిందితులుగా విచారణ చేసింది. చివరికి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ విచారణ వరకు చేరింది. ఫోన్ ట్యాపింగ్ సర్వసాధారణమని BRS స్పష్టం చేస్తుండగా, ఇది అక్రమ చర్య అని ప్రభుత్వం పేర్కొంటోంది.

News February 1, 2026

ఈ నియమాలు తెలియకుండానే నదిలో నాణేలు వేస్తున్నారా!

image

నదిలో నాణేలు వేయడానికి ఆది/మంగళ వారాలు ప్రశస్తమైనవని పండితులు చెబుతున్నారు. ‘స్నానాంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి, తూర్పు ముఖంగా ఉంటూ, కులదైవాన్ని ప్రార్థిస్తూ ఈ పరిహారం పాటించాలి. రాగి నాణేన్ని ప్రవహించే నీటిలోనే వేయాలి. అది నీటి ప్రవాహంతో పాటు ముందుకు సాగిపోతే జాతక దోషాలు తొలగి అధిక పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. పూర్వం నీటి శుద్ధి కోసం రాగిని వాడే ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది’ అంటున్నారు.

News February 1, 2026

గ్లోబల్ గ్రోత్‌లో ఇండియా ‘పవర్’… మస్క్ ఫిదా!

image

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. లేటెస్ట్ IMF డేటా ప్రకారం ప్రపంచ వృద్ధిలో ఇండియా 17% వాటాతో అమెరికా (9.9%) కంటే చాలా ముందుంది. చైనా, భారత్ కలిపి గ్లోబల్ గ్రోత్‌లో దాదాపు 43.6% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ గణాంకాలను షేర్ చేస్తూ, ప్రపంచ ఆర్థిక శక్తి ఇప్పుడు తూర్పు దేశాల వైపు మళ్లుతోందని ‘Balance of power is changing’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.