News July 12, 2024
వేరియబుల్ పేను అటెండెన్స్కు లింక్ చేసిన TCS

వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి ఆఫీసుకు రావాలని TCS ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించినా ఇంకా చాలా మంది రావట్లేదు. ఈక్రమంలో వేరియబుల్ పేను అంటెండెన్స్కు లింక్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 70శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నట్లు చీఫ్ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉంటేనే పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందుతారు. 60% కంటే తక్కువ హాజరు ఉంటే బోనసే రాదు.
Similar News
News January 29, 2026
పిల్లల చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్నానానికి ముందు నువ్వుల నూనెలను ఒంటికి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి. సబ్బు వీలైనంత తక్కువగా వాడాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్, మ్యాంగో బటర్ కాంబినేషన్లో ఉండే వాటిని ఎంచుకోవాలి. ఇవి పిల్లల చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
News January 29, 2026
చామంతి తోటలో నత్తల నివారణకు సూచనలు

చామంతి తోటల్లో నత్తల దాడితో కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టపోతున్నారు. వీటి నివారణకు మెథియోకార్బ్ గుళికలు 2KGలకు, అంతే మోతాదులో వరి తవుడు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నత్తలు తిరిగే దారిలో మొక్కల చుట్టూ చల్లాలి. అజాడిరక్టిన్(3000 P.P.M) 10ML లేదా కుంకుడు పొడి 60 గ్రాములను లీటరు నీటికి కలిపి నత్తలు తిరిగే మార్గంలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 29, 2026
హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్తో సీఎం రేవంత్

US పర్యటనలో ఉన్న తెలంగాణ CM రేవంత్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో భేటీ అయ్యారు. భారతీయ విద్యార్థుల బృందం ఆహ్వానంతో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్కు వెళ్లారు. కెరీర్ టార్గెట్స్, స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకున్నారు. విద్యార్థుల విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. రైజింగ్ తెలంగాణ విజన్ను వివరించారు. అంతర్జాతీయ పెట్టుబడులకు రాష్ట్రం కేరాఫ్గా మారిందని తెలిపారు.


