News July 12, 2024
వేరియబుల్ పేను అటెండెన్స్కు లింక్ చేసిన TCS

వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి ఆఫీసుకు రావాలని TCS ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించినా ఇంకా చాలా మంది రావట్లేదు. ఈక్రమంలో వేరియబుల్ పేను అంటెండెన్స్కు లింక్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 70శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నట్లు చీఫ్ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉంటేనే పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందుతారు. 60% కంటే తక్కువ హాజరు ఉంటే బోనసే రాదు.
Similar News
News December 11, 2025
సిరిసిల్ల: తొలి 2 గంటల్లో 17.46% పోలింగ్

జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఐదు మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 17.46 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చందుర్తిలో 14.75 శాతం, కోనరావుపేటలో 17.81 శాతం, రుద్రంగిలో 18.20 శాతం, వేములవాడలో 19.85 శాతం, వేములవాడ రూరల్లో 18.03 శాతం పోలింగ్ రికార్డైనట్లు వెల్లడించారు. వేములవాడ అర్బన్ మండలంలో అత్యధిక పోలింగ్, చందుర్తి మండలంలో అత్యల్ప పోలింగ్ నమోదయింది.
News December 11, 2025
ఉడిపి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News December 11, 2025
తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేటు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 110 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.100 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,09,000గా ఉంది. సిల్వర్ రేటు నాలుగు రోజుల్లోనే రూ.13,100 పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


