News July 12, 2024
వేరియబుల్ పేను అటెండెన్స్కు లింక్ చేసిన TCS

వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి ఆఫీసుకు రావాలని TCS ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించినా ఇంకా చాలా మంది రావట్లేదు. ఈక్రమంలో వేరియబుల్ పేను అంటెండెన్స్కు లింక్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 70శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నట్లు చీఫ్ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉంటేనే పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందుతారు. 60% కంటే తక్కువ హాజరు ఉంటే బోనసే రాదు.
Similar News
News February 4, 2026
మళ్లీ పుంజుకున్న గోల్డ్ రేట్స్!

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతవారం స్వల్పంగా తగ్గిన పసిడి ధర ఇవాళ తిరిగి $5,000(ఔన్స్కు) మార్కును దాటింది. USA-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డాలర్ బలహీనపడటం, సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో HYD మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ₹1,60,530కు చేరింది.
News February 4, 2026
ఆ ఏడుగురు MLAలకు మున్సి‘పోల్స్’ సవాలే

TG: BRS నుంచి ఎన్నికై INCకి దగ్గరగా మెలగుతున్న MLAలకు మున్సి‘పోల్స్’ సవాలుగా మారాయి. శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట రావు, సంజయ్ కుమార్, కృష్ణ మోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, యాదయ్య నియోజకవర్గాల్లోని స్థానాలపై CM రేవంత్ నివేదికలు రప్పిస్తున్నారు. ఇక్కడి పార్టీ శ్రేణులు ఎన్నికల్లో ఏమేరకు సహకరిస్తాయో అన్న అనుమానాలు వారిని పీడిస్తున్నాయి. మరోవైపు ఈ మున్సిపాల్టీల్లోని తమ క్యాడర్ను BRS ఏకం చేస్తోంది.
News February 4, 2026
ఒక్క AI టూల్.. ₹2 లక్షల కోట్ల సంపద ఆవిరి!

భారతీయ IT రంగానికి నేడు బ్లాక్ వెడ్నెస్ డే అనే చెప్పాలి. AIతో సాఫ్ట్వేర్ కంపెనీల భవిష్యత్తుపై ఆందోళన తీవ్రమవడంతో ఇన్వెస్టర్లు IT షేర్లను భారీగా అమ్మేశారు. దీంతో ఈ ఒక్కరోజే ఈ రంగంలో ₹2 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. 2020 మార్చి తర్వాత ఇదే అతిపెద్ద పతనం. TCS, ఇన్ఫీ సహా అన్ని దేశీయ IT కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి ఉంది. అమెరికా AI సంస్థ ఆంత్రోపిక్ తెచ్చిన కొత్త ఆటోమేషన్ టూల్ ఈ పతనానికి దారితీసింది.


