News January 31, 2025

TDPకి పెద్దిరెడ్డి వార్నింగ్

image

YCP శ్రేణలను ఇబ్బంది పెడితే వదిలిపెట్టమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదని, వారి జోలికి వస్తే TDP భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించిన CMచంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ నేత పురందీశ్వరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తనపై వస్తున్నవన్ని తప్పుడు ఆరోపణలని ఆయన మరోమారు స్పష్టం చేశారు.

Similar News

News February 26, 2026

పనులు పరిశీలించిన చిత్తూరు కలెక్టర్

image

త్వరలో చిత్తూరులో ప్రారంభం కానున్న కేంద్రీయ విద్యాలయం పనులను కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల భవన నిర్మాణ పనులు, తరగతి గదుల సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

News February 26, 2026

చిత్తూరులో ఆ అధికారులంతా ట్రాన్స్‌ఫర్

image

2018 గ్రూప్-1 బ్యాచ్ అధికారులను ప్రాధాన్యత పోస్టుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది RDOలు, 25 మంది DSPలను బదిలీ చేస్తూ హెడ్ క్వార్టర్స్ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో చిత్తూరు జిల్లా కుప్పం, నగరి RDOలు శ్రీనివాసులు రాజు, భవాని శంకరి, నగరి DSP మహమ్మద్ అజీజ్, సాంఘిక సంక్షేమశాఖ DD విక్రమ్ కుమార్ రెడ్డి బదిలీ అయ్యారు

News February 26, 2026

చిత్తూరు: పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్

image

పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-5 నుంచి గ్రేడ్-4కు ప్రమోషన్ ఇచ్చారు. చిత్తూరు DPO సుధాకర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లాలో 23 మందికి ప్రమోషన్ రాగా.. అన్నమయ్య జిల్లాలో పదోన్నతి పొంది అదనంగా ఉన్న 14 మందిని చిత్తూరు జిల్లాకు తీసుకున్నారు. తిరుపతి జిల్లాలో 10 మందికి ప్రమోషన్ ఇచ్చారు. పలు గ్రేడ్లలో ఉన్న 10 మందిని చిత్తూరు జిల్లాకు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.