News March 16, 2025
TDP నేతలపై MLA థామస్ ఆగ్రహం

పేదల అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అభివృద్ధికి అడ్డుపడితే సహించనని పలువురు TDP నేతలపై ఎమ్మెల్యే థామస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెనుమూరులో పర్యటించిన ఆయన.. కేవలం పార్టీలోని కొందరు నేతలు YCP నేతలతో తిరుగుతూ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. తాను దేశాలు తిరిగిన నేతనని, అగ్రకులాల వారికి సలాం చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు. తనను రెచ్చిగొడితే అంతు చూస్తానన్నారు.
Similar News
News March 17, 2025
30 ఏళ్లకు TDP విక్టరీ.. అప్పుడే తమ్ముళ్లకు తలనొప్పులు

GDనెల్లూరులో 30 ఏళ్లకు విక్టరీ కొట్టిన TDPకి తలనొప్పులు మొదలయ్యాయి. కొందరు టీడీపీ నేతలే MLA థామస్కు వ్యతిరేంకగా పని చేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. GDN పర్యటనకు వచ్చిన CM సైతం దీనిపై ఘాటుగానే స్పందించారు. థామస్ ఎక్కువగా నియోజకవర్గం బయటే ఉండటంతో నేతలు, కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నారంట. ఇలాంటివి తానంటే గిట్టని వారు చేస్తోన్న అసత్య ప్రచారాలని, వారిని వదలనని థామస్ గట్టిగానే హెచ్చరించారు.
News March 17, 2025
చిత్తూరు: 10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదివారం తెలిపారు. మొత్తం 118 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు 20, 954 మంది, ప్రైవేటు విద్యార్థులు 294 మంది పరీక్షకు హాజరవుతున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోనికి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News March 16, 2025
చిత్తూరు: 10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదివారం తెలిపారు. మొత్తం 118 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు 20, 954 మంది, ప్రైవేటు విద్యార్థులు 294 మంది పరీక్షకు హాజరవుతున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోనికి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.