News March 20, 2024

నేడు టీడీపీ 3వ జాబితా?

image

AP: టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలపైనా ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. మైలవరం, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలపై సందిగ్ధత వీడనుందని సమాచారం. మొత్తం 25 ఎంపీ సీట్లకు గాను, 17 సీట్లలో టీడీపీ, రెండు సీట్లలో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 23, 2025

మూవీ అప్డేట్స్

image

✹ ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో రానున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమంతో మొదలు.. ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి
✹ ఇవాళ సాయంత్రం 6.11గంటలకు ‘రాజాసాబ్’ నుంచి రిలీజ్ కానున్న ‘రెబల్ సాబ్’ సాంగ్.. మరో పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
✹ శివ నిర్వాణ, రవితేజ కాంబినేషన్లో రానున్న కొత్త మూవీ షూటింగ్ రేపటి నుంచి మొదలు!
✹ ధనుష్, కృతి సనన్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ చిత్రం తెలుగులో ‘అమరకావ్యం’గా విడుదల కానుంది

News November 23, 2025

రాష్ట్రపతి పరిధిలోకి ‘చండీగఢ్’?: స్పందించిన కేంద్రం

image

పంజాబ్, హరియాణాల సంయుక్త రాజధాని చండీగఢ్‌పై చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ శీతాకాల సమావేశాల్లో దీనిపై బిల్లు ఉండదని స్పష్టం చేసింది. కాగా ఈ ప్రపోజల్‌ను ఆప్, అకాలీదళ్, INC సహా పంజాబ్ BJP తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా ప్రస్తుతం ఉమ్మడి రాజధానిపై పంజాబ్ గవర్నర్‌కు పాలనాధికారం ఉంది.

News November 23, 2025

విత్తనాలు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

మంచి నాణ్యత, మొలకెత్తే శక్తి అధికంగా కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సరైన సీలుతో మరియు ధ్రువీకరణ పత్రంతో ఉన్న విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలి. విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనుగోలు చేయాలి. కొనుగోలు రశీదు తప్పక తీసుకోవాలి. దీనిపై రైతు, డీలర్ సంతకం తప్పక ఉండాలి.