News March 27, 2024
పవన్ కళ్యాణ్ను కలిసిన టీడీపీ, బీజేపీ నేతలు

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పలువురు టీడీపీ, బీజేపీ నేతలు కలిశారు. ఇవాళ మంగళగిరిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. వీరి వెంట ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా ఉన్నారు. అలాగే తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా పవన్ను కలిశారు. ఎన్నికల్లో తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వీరు కోరినట్లు తెలుస్తోంది.
Similar News
News January 21, 2026
అమ్మాయిలతో ఎలా మెలగాలో అబ్బాయిలకు క్లాసులు!

బ్రిటన్ పాఠశాలల్లో విద్యార్థులకు వినూత్నరీతిలో పాఠాలు బోధిస్తున్నారు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలి, వారితో ఎలా మర్యాదగా ప్రవర్తించాలనే అంశాలపై అబ్బాయిలకు స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం, బాధ్యతగా మెలగడం వంటి విలువలను నేర్పిస్తే వేధింపులను అరికట్టవచ్చని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి విధానం ఇండియాలోనూ తీసుకురావాలనే చర్చ జరుగుతోంది.
News January 21, 2026
కర్ణాటక అసెంబ్లీలో ప్రసంగానికి నో చెప్పిన గవర్నర్

కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రారంభ ఉపన్యాసం చేయడానికి నిరాకరించారు. ఈనెల 22-31వ తేదీ వరకు కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని ఈరోజు ఉదయం CM సిద్దరామయ్య మీడియాకు తెలిపారు. నరేగా పథకం పేరు మార్పు, ఉపాధి హామీ చట్టం రక్షణపై చర్చిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది.
News January 21, 2026
టీనేజ్ పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా?

అప్పటివరకు సంతోషంగా, చురుగ్గా ఉండే కొందరు పిల్లలు కాలేజీకి వెళ్లగానే సైలెంట్ ఐపోతారు. పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పును వెంటనే గుర్తించాలంటున్నారు నిపుణులు. వేధింపులకు గురవుతున్నారేమో పరిశీలించాలి. అనునయంగా మాట్లాడి సమాచారాన్ని రాబట్టాలి. భయాన్ని పోగొట్టి, తామున్నామనే భరోసా, నమ్మకాన్ని తల్లిదండ్రులు కలిగించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సూచిస్తున్నారు.


