News September 9, 2025

ఓటేసిన టీడీపీ, బీజేపీ ఎంపీలు

image

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. కాసేపటి క్రితమే టీడీపీ ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 16 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఎంపీలు సైతం ఓటు వేశారు. వీరిలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ఈటల, డీకే అరుణ తదితరులున్నారు.

Similar News

News September 9, 2025

తెలుగు జాతికి నేడు చీకటి రోజు: షర్మిల

image

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి TDP, జనసేన, YCP మద్దతుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘తెలుగు జాతికి నేడు చీకటి రోజు. తెలుగు బిడ్డ(సుదర్శన్ రెడ్డి) పోటీ పడితే, RSS వాదికి ఓటు వేయించిన 3 పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు. మత పిచ్చి మోదీకి మోకాళ్లు ఒత్తడమే వారి లక్ష్యం. BJPకి ఓటు వేసినందుకు YCP సిగ్గుపడాలి. కేసులకు భయపడి మోదీకి జగన్ దత్తపుత్రుడిగా అవతారం ఎత్తారు’ అని ట్వీట్ చేశారు.

News September 9, 2025

PHOTO: వింటేజ్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

image

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోనే హీరోయిన్ నయనతార-చిరు మధ్య ఓ మెలోడీ సాంగ్ తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో చిరంజీవి తాజా లుక్ SMలో వైరల్ అవుతోంది. వింటేజ్ లుక్‌లో మెగాస్టార్ అదిరిపోయారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News September 9, 2025

కవిత TDPలోకి వస్తారా? లోకేశ్ ఏమన్నారంటే..

image

కల్వకుంట్ల కవిత టీడీపీలోకి వస్తారా? అనే ప్రశ్నకు నారా లోకేశ్ స్పందించారు. ‘కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిది’ అని వ్యాఖ్యానించారు. తాను KTRను వివిధ సందర్భాల్లో కలిశానని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. NDA అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో జగన్‌ను అడగాలని మీడియా చిట్‌చాట్‌లో అన్నారు.