News April 19, 2024
ఎల్లుండి అభ్యర్థులకు టీడీపీ బీఫాంలు

AP: TDP చీఫ్ చంద్రబాబు ఈనెల 21న అభ్యర్థులకు బీఫాంలు అందజేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో 144 మంది అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు బాబు స్వయంగా వాటిని అందజేస్తారు. అనంతరం ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, మిత్రపక్షాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు 2,3 చోట్ల అభ్యర్థుల మార్పుపై కసరత్తు చేస్తున్న బాబు.. అదేరోజు కొత్త అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News December 7, 2025
HNK: వెంకట్ రెడ్డిపై మరో ఏసీబీ కేసు

స్కూల్ రెన్యూవల్కు <<18480655>>రూ.60 వేలు లంచం <<>>తీసుకుంటూ ACBకి దొరికిన HNK అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ACB అధికారుల సోదాల్లో వెంకట్ రెడ్డి ఇంటిలోని బీరువాలో రూ.30 లక్షల నగదు దొరకడం, HYDలో ల్యాండ్ పేపర్లు, నగదు దొరకడంతో ఆదాయం మించిన ఆస్తుల కేసు కూడా నమోదు చేశారు. భారీగా నగదుతో పాటుగా విదేశీ మద్యం, బంగారు ఆభరణాలు దొరికినట్టు తెలిసింది. అధికారికంగా ఎంత విలువ ఉంటుందో ACB వెల్లడించనుంది.
News December 7, 2025
చలికాలం.. వీళ్లు జాగ్రత్త!

చలికాలంలో గుండెజబ్బుల ముప్పు ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు తీవ్రత సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నవంబర్-ఫిబ్రవరి మధ్య హార్ట్ ఎటాక్ ఘటనలు 15-20% అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. గుండె జబ్బులు, BP, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం ఉన్నవారు, ధూమపానం, మద్యపానం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News December 7, 2025
సోనియా, రాహుల్ సపోర్టర్లను ఈడీ వేధిస్తోంది: డీకే శివకుమార్

నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియాకు తాను విరాళాలు ఇచ్చినందుకు నోటీసులతో ED వేధిస్తోందని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ ఆరోపించారు. ‘మేం పన్నులు కడుతున్నాం. మా డబ్బును ఎవరికైనా ఇచ్చే స్వేచ్ఛ మాకుంది. మమ్మల్ని హింసించడానికే PMLA కేసు నమోదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ సపోర్టర్లను వేధించడం, గందరగోళం సృష్టించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది’ అని మండిపడ్డారు. EDకి ఇప్పటికే అన్ని వివరాలు అందజేశానన్నారు.


