News June 4, 2024

25 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుపు

image

AP: రాష్ట్రంలో అతి తక్కువ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్. రాజు తన సమీప ప్రత్యర్థి ఈర లక్కప్పపై 25 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 78347 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్పకి 78,322 ఓట్లు నమోదయ్యాయి.

Similar News

News November 20, 2025

రోజ్‌ మేరీ ఆయిల్‌‌తో ఎన్నో లాభాలు

image

పొడవాటి నల్లని, ఒత్తయిన జుట్టు కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. వాటికోసం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్నీ వాడతారు. వాటిల్లో ఒకటే రోజ్ మేరీ ఆయిల్. ఇందులో ఐరన్‌, క్యాల్షియం, విటమిన్‌ బి ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్లకు లోపలి నుంచి పోషణ ఇస్తుంది. జుట్టు నిగనిగలాడుతూ కాంతిమంతంగా మారుతుంది. జుట్టు పెరుగుదలలో చక్కటి ఫలితాలుంటాయి. త్వరగా పొడిబారే జుట్టు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

News November 20, 2025

ఎప్‌స్టీన్ సీక్రెట్ ఫైల్స్ విడుదలకు ట్రంప్ సైన్

image

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సీక్రెట్ ఫైల్స్‌ విడుదలకు న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. తమ విజయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను <<18272345>>డెమోక్రాట్లు<<>> ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు. 2019లో ఫెడరల్ జైలులో ఎప్‌స్టీన్ మరణంపై దర్యాప్తుకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని ఈ బిల్లు కోరుతోంది. ఈ క్రమంలో ఎవరి పేర్లు బయటపడతాయోనని ఆసక్తి నెలకొంది.

News November 20, 2025

రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

RRB 5,810 NTPC పోస్టుల దరఖాస్తు గడువును పొడిగించింది. నేటితో అప్లై గడువు ముగియగా.. ఈనెల 27వరకు పొడిగించింది. ఫీజు చెల్లించడానికి ఈ నెల 29 వరకు ఛాన్స్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో 18- 33ఏళ్లు గల వారు అప్లై చేసుకోవచ్చు. CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.