News October 28, 2024

జగన్‌పై టీడీపీ తీవ్ర విమర్శలు

image

AP: వైసీపీ చీఫ్ జగన్‌పై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. జగన్ లాంటి సైకో కొడుకు ఏ తల్లికీ వద్దని Xలో రాసుకొచ్చింది. ‘వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తల్లి విజయమ్మని దింపేసిన సైకో కొడుకు జగన్ ఆమెను ఇంట్లోంచి కూడా గెంటేశాడు. ఇప్పుడు ఏకంగా కేసు పెట్టి కోర్టుకి లాగాడు. 70 ఏళ్ల వయసులో ఏ తల్లికీ ఇంత క్షోభ ఉండదు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News January 21, 2026

వరిలో పాముపొడ(మాగుడు) తెగులు – నివారణ

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాలిలో తేమ వల్ల వరిలో పాముపొడ తెగులు ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. వరి దుబ్బు చేసే దశలో ఇది వ్యాపిస్తుంది. వరి కాండం, ఆకులపై పాము పొడ లాంటి మచ్చలు కనిపిస్తాయి. తెగులు తీవ్రమైతే మొక్కలు ఎండి, తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400ml హెక్సాకొనజోల్ 5 SP లేదా 400ml వాలిడామైసిన్ 3 SL లేదా 200ml ప్రోపికొనజోల్ 25% EC కలిపి పిచికారీ చేయాలి.

News January 21, 2026

దానిమ్మ రైతులకు కాసుల పంట.. టన్ను రూ.2 లక్షలు

image

AP: దానిమ్మ రైతులకు మంచి రోజులు వచ్చాయి. 3 నెలల క్రితం టన్ను రూ.50వేల నుంచి రూ.60 వేల వరకు పలికిన దానిమ్మ ఇప్పుడు ఏకంగా రూ.2 లక్షలు పలుకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట తెగుళ్లు, బ్యాక్టీరియా బారిన పడకుండా జాగ్రత్తగా సాగు చేయడం వల్లే రేట్లు పెరిగాయని చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో 15వేలకు పైగా హెక్టార్లలో (ప్రధానంగా రాయలసీమ) దానిమ్మ పంట పండిస్తున్నారు.

News January 21, 2026

పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

image

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.