News June 4, 2024
లక్షన్నర ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ఫైర్బ్రాండ్ పెమ్మసాని

AP: ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డు మెజార్టీ దిశగా వెళ్తున్నారు. ఇప్పటివరకు ఆయనకు 3,44,736 ఓట్లు పోలవగా.. 1,58,185 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తన పదునైన మాటలతో వైసీపీపై విరుచుకుపడ్డ ఈ ఎన్నారై.. ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఫైర్ బ్రాండ్గా నిలిచారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు ఇప్పటివరకు 1,86,551 ఓట్లు పోలయ్యాయి.
Similar News
News December 1, 2025
గంభీర్.. రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలు?

టీమ్ఇండియా కోచ్ గంభీర్, స్టార్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలున్నట్లుగా తెలుస్తోంది. ‘గంభీర్-రోహిత్, కోహ్లీ మధ్య బంధాలు అంత బాగా లేవు. ఇద్దరు ప్లేయర్ల భవిష్యత్తుపై విశాఖ లేదా రాయ్పూర్లో మీటింగ్ జరిగే ఛాన్స్ ఉంది’ అని జాతీయ మీడియా తెలిపింది. టెస్టులకు వీరు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచే వివాదాలు మొదలైనట్లు పేర్కొంది. రోహిత్, సెలక్టర్ అగార్కర్ మధ్య కూడా సంబంధాలు సరిగా లేవని చెప్పింది.
News December 1, 2025
భారీ జీతంతో ECGC లిమిటెడ్లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECGC)లో 30 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, MA(హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. DEC 15నుంచి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు. JAN 11న రాత పరీక్ష, FEB/MARలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు జీతం రూ.88,635 -రూ.1,69,025 చెల్లిస్తారు.
News December 1, 2025
భక్తికి, నిరీక్షణకు ప్రతీక ‘శబరిపీఠం’

నిర్గుణోపాసన, నిరంతర నిరీక్షణకు ప్రతీక ‘శబరిపీఠం’. ఈ పవిత్ర స్థలంలోనే శబరి మాత కఠోర భక్తితో అయ్యప్ప స్వామి దర్శనం పొందింది. ఈ పీఠానికి దాదాపు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. పూర్వకాలంలో, పందళ రాజవంశీయులు ఇక్కడ ఓ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసి విద్యనభ్యసించారని ప్రతీతి. భక్తికి, నిరీక్షణకు గొప్ప ఉదాహరణగా నిలిచే ఈ ప్రదేశం అయ్యప్ప స్వాములకు పరమాత్మ దర్శనానికి మార్గాన్ని చూపిస్తుంది. <<-se>>#AyyappaMala<<>>


