News February 7, 2025
అంబటి రాంబాబుకు టీడీపీ నేత కౌంటర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738903945518_893-normal-WIFI.webp)
AP: రాష్ట్రంలో ‘ర్యాంకు’ రాజకీయం నడుస్తోంది. మంత్రుల ర్యాంకుల్లో ‘8, 9 స్థానాలు వచ్చిన లోకేశ్, పవన్కు అభినందనలు’ అంటూ <<15384201>>అంబటి రాంబాబు<<>> చేసిన ట్వీట్కు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘అయ్యా అంబటి 8, 9 స్థానాల్లో వచ్చిన వారిద్దరూ 1, 2 స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే 11 స్థానాల్లో ఉన్న మీ జగన్ కూడా వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానంలోకి రావడానికి మరింత కృషి చేస్తున్నాడు’ అని సెటైర్ వేశారు.
Similar News
News February 7, 2025
AI సమ్మిట్: వచ్చేవారం ఫ్రాన్స్కు మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738912175379_1199-normal-WIFI.webp)
ప్రధాని నరేంద్రమోదీ వచ్చేవారం ఫ్రాన్స్లో పర్యటిస్తారు. FEB 11న పారిస్లో జరిగే AI సమ్మిట్కు ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్తో కలిసి కో ఛైర్మన్గా వ్యవహరిస్తారని తెలిసింది. దీనికి US VP JD వాన్స్, చైనా DyPM లీ కియాంగ్ హాజరవుతారు. 12న ఎయిరోస్పేస్, ఇంజిన్స్, సబ్మెరైన్ సహా ఇతర రంగాల్లో ఒప్పందాల పురోగతిపై మేక్రాన్, మోదీ చర్చిస్తారు. ఫ్రెంచ్ కంపెనీల అధిపతులు, దౌత్యవేత్తలతో సమావేశమవుతారు.
News February 7, 2025
తెలంగాణ పల్లె కన్నీరుపెడుతోంది: KTR
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738913170242_893-normal-WIFI.webp)
TG: కాంగ్రెస్ ఇచ్చిన 420 అబద్ధపు హామీల పాపానికి ఇప్పటివరకు 420 మంది రైతులు బలయ్యారని KTR ఆరోపించారు. ‘అసమర్థులు అధికార పీఠమెక్కి అన్నదాతలను బలిపీఠం ఎక్కిస్తున్నారు. రుణమాఫీ, పెట్టుబడి సాయం అందించకపోవడం వల్లే ఈ అనర్థాలు. చలనం లేని సీఎం, బాధ్యత లేని సర్కారు వల్లే మళ్లీ తెలంగాణ పల్లె కన్నీరుపెడుతోంది. ఇకనైనా సాగు సంక్షోభాన్ని తీర్చి అన్నదాతల ఆత్మహత్యలను ఆపండి’ అని ట్వీట్ చేశారు.
News February 7, 2025
కుంభమేళాలో పాక్ హిందువుల స్నానాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738911022239_1045-normal-WIFI.webp)
మహా కుంభమేళాలో పాల్గొనేందుకు పాకిస్థాన్ నుంచి 68మంది హిందువులు ప్రయాగరాజ్కు చేరుకున్నారు. తమది సింధ్ ప్రావిన్స్ అని, 144 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ మహత్తర సందర్భాన్ని మిస్ చేసుకోలేక భారత్కు వచ్చామని వివరించారు. ‘హరిద్వార్కు వెళ్లి మా అందరి పూర్వీకుల అస్థికల్ని గంగలో కలిపాం. మా మతం గొప్పదనాన్ని తొలిసారిగా మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు.