News June 4, 2024

విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ ముందంజ

image

AP: విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ తరఫున బెల్లాన చంద్రశేఖర్ బరిలో నిలిచారు. అటు బొబ్బిలిలో కూడా టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Similar News

News September 8, 2025

భారత్‌పై అమెరికా టారిఫ్స్ సరైనవే: జెలె‌న్‌స్కీ

image

భారత్‌పై అమెరికా సుంకాలు విధించడం సరైనదేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రష్యాతో డీల్ కొనసాగిస్తున్న దేశంపై టారిఫ్స్ విధించడం మంచి ఐడియానే’ అని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ ముగింపునకు ఇతర దేశాలతో కలిసి కృషి చేస్తున్న భారత్‌పై జెలెన్‌స్కీ తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ కూడా ఆయనతో పలుమార్లు ఫోన్‌లో <<17582171>>మాట్లాడిన<<>> విషయం తెలిసిందే.

News September 8, 2025

ఫుడ్ డెలివరీ యాప్స్‌లో అధిక ధరలు.. నెట్టింట చర్చ!

image

రెస్టారెంట్‌ ధరలు, ఫుడ్ డెలివరీ యాప్ ధరలకు భారీ వ్యత్యాసం ఉండటంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ వ్యక్తి తన ఇంటికి దగ్గర్లోని రెస్టారెంట్ నుంచి స్విగ్గీలో ఆహారాన్ని బుక్ చేయాలనుకున్నాడు. అందులో రూ.1,473 ఛార్జ్ చేయడం చూసి అతడే స్వయంగా రెస్టారెంట్‌కు వెళ్లి రూ.810కే తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని Xలో లేవనెత్తడంతో తామూ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నామని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. మీకూ ఇలానే జరిగిందా?

News September 8, 2025

మధ్యాహ్నం 2గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పవనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రకటించనున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.