News March 7, 2025

TDP MLA అరవింద్ బాబుపై అధిష్ఠానం ఆగ్రహం

image

AP: నరసరావుపేట TDP MLA చదలవాడ అరవింద్ బాబుపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న ఎక్సైజ్ ఆఫీసులో హల్‌చల్ చేసినట్లు ఫిర్యాదు అందగా, ఆయన వ్యవహరించిన తీరు సరికాదని మందలించింది. ఘటనపై వివరణ ఇవ్వాలని TDP కేంద్ర కార్యాలయం నోటీసులు జారీ చేసింది. YCP హయాంలో నియమించిన ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులను తీసేసి తనవారికి ఉద్యోగాలివ్వాలని లేఖ రాసినా స్పందించలేదని MLA హల్‌చల్ చేసినట్లు సమాచారం.

Similar News

News December 25, 2025

స్వయంకృషి: MILK.. మిడిల్ క్లాస్ సిల్క్!

image

ప్రతి ఇంటికీ పొద్దున్నే కావాల్సిన పాలు ఇప్పుడు కల్తీ లేదా ప్యాకెట్ మయంగా మారాయి. ప్రజలు వీటితో నష్టం గ్రహించి తిరిగి లోకల్ సెల్లర్స్, మిల్క్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. రైతులకు టైమ్‌కు, తగిన ధర చెల్లిస్తే నాణ్యమైన పాలు పొందడం కష్టమేం కాదు. నమ్మకం, నాణ్యత మెయింటైన్ చేస్తే రోజూ పట్టణాలు, నగరాల్లో ₹వేల ఆదాయం. మిగిలితే అనే భయం లేకుండా పెరుగు, నెయ్యి లాంటి ఆప్షన్స్ ఉంటాయి.
-డైలీ 1pmకు ఓ బిజినెస్ ఐడియా

News December 25, 2025

హిందూత్వం ఓ మహోన్నత మార్గం

image

హిందూ అనేది కేవలం మతం కాదు. ఇదో ‘జీవన విధానం’. మతం అనేది నిర్దిష్ట ప్రవక్త, గ్రంథానికి కట్టుబడి ఉంటుంది. కానీ హిందూ ధర్మంలో అనేక మార్గాలు, గ్రంథాలు, దైవ రూపాలు ఉన్నాయి. ఇది మనిషి తన బాధ్యతలను (ధర్మాన్ని) ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. సత్యం, అహింస, ప్రాణి కోటి పట్ల దయ చూపడం వంటి విశ్వవ్యాప్త సూత్రాలే దీని పునాది. అందుకే హిందుత్వాన్ని క్రమశిక్షణతో కూడిన ‘ధర్మం’ అని కొలుస్తుంటారు.

News December 25, 2025

₹1.5లక్షల కోట్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు దిశగా అడుగులు

image

AP: రాష్ట్రంలో ₹1.5 లక్షల కోట్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మారిటైమ్ బోర్డు ద్వారా 20 MOUల్లో 14 అమల్లోకి వచ్చాయని స్పెషల్ CS కృష్ణబాబు వెల్లడించారు. ‘వీటిలో ₹10వేల CR విలువైనవి 3 ఉన్నాయి. APDC ద్వారా ₹10వేల కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. GMR ఏరోసిటీ, మూలపేట పోర్టు, పల్నాడు, సత్యసాయి, కర్నూలు ప్రాంతాల్లో ఏరోస్పేస్ ప్రాజెక్టులు రానున్నాయి’ అని తెలిపారు.