News March 7, 2025
TDP MLA అరవింద్ బాబుపై అధిష్ఠానం ఆగ్రహం

AP: నరసరావుపేట TDP MLA చదలవాడ అరవింద్ బాబుపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న ఎక్సైజ్ ఆఫీసులో హల్చల్ చేసినట్లు ఫిర్యాదు అందగా, ఆయన వ్యవహరించిన తీరు సరికాదని మందలించింది. ఘటనపై వివరణ ఇవ్వాలని TDP కేంద్ర కార్యాలయం నోటీసులు జారీ చేసింది. YCP హయాంలో నియమించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసేసి తనవారికి ఉద్యోగాలివ్వాలని లేఖ రాసినా స్పందించలేదని MLA హల్చల్ చేసినట్లు సమాచారం.
Similar News
News November 20, 2025
మహబూబ్ నగర్: ఎస్పీ కీలక ఆదేశాలు జారీ

మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి రైతులకు కీలక సూచనలు జారీ చేశారు. రోడ్లపై ధాన్యం మారపోసి ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా, ధాన్యంపై నల్లని కవర్లు కప్పడం వాటిపై రాళ్లని పెట్టడం వల్ల రాత్రి వేళల్లో వాహనదారులు ముందున్న అడ్డంకి గుర్తించలేక, భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
News November 20, 2025
ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

☛ 16 ఏళ్లలోపు టీనేజర్లు సోషల్మీడియా వాడకూడదనే నిబంధన ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి అమలులోకి రానుంది. ఆ టీనేజర్ల అకౌంట్లను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయనుంది.
☛ ఇండోనేషియాలోని సీరమ్ ఐలాండ్లో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
☛ చెక్ రిపబ్లిక్ సౌత్ ప్రాగ్కు 132 కి.మీ దూరంలో 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా, 40 మంది స్వల్పంగా గాయపడ్డారు.
News November 20, 2025
తిరుమలలో గంటల శబ్దం వచ్చేది ఇక్కడి నుంచే..

తిరుమల వేంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించేటప్పుడు గంటల శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ గంటలున్న మండపాన్ని తిరుమామణి అని అంటారు. ఇందులో ముఖ్యంగా రెండు గంటలు ఉంటాయి. మొదటిది నారాయణ గంట. రెండవది గోవింద గంట. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ మండపాన్ని సామాన్య శకం 1417వ సంవత్సరంలో మాధవదాసు అనే భక్తుడు నిర్మించాడు. స్వామివారి నివేదన వేళ ఆయన్ను స్మరించుకోవడానికి ఈ మండపం ఒక ముఖ్యమైన భాగం. <<-se>>#VINAROBHAGYAMU<<>>


