News June 24, 2024
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని TDP ఎమ్మెల్సీల వినతి

AP: గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ని వాయిదా వేయాలని APPSC సెక్రటరీని TDP MLCలు కోరారు. ఈ మేరకు MLCలు వేపాడ చిరంజీవిరావు, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ వినతిపత్రం అందజేశారు. జులై 28న జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు ఎదుర్కొనే సవాళ్లను వివరించారు. ముఖ్యంగా కొత్త సిలబస్ను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు గాను అభ్యర్థులకు మరికొంత సమయం కావాలన్నారు. కాగా మెయిన్స్కు 92,250 మంది క్వాలిఫై అయ్యారు.
Similar News
News November 21, 2025
అండమాన్లో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడవచ్చని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో శనివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
News November 21, 2025
మూవీ ముచ్చట్లు

* ప్రభాస్ చాలా సున్నిత మనస్కుడు.. ఐ లవ్ హిమ్: అనుపమ్ ఖేర్
* DEC 5న జీ5 వేదికగా OTTలోకి ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ
* ‘కొదమసింహం’ రీ రిలీజ్.. వింటేజ్ చిరును చూసి ఫ్యాన్స్ సంబరాలు
* కిచ్చా సుదీప్ మహిళలను కించపరిచారంటూ కన్నడ బిగ్బాస్ సీజన్-12పై మహిళా కమిషన్కు ఫిర్యాదు
* జైలర్-2 తర్వాత తలైవా 173కి కూడా నెల్సన్ దిలీప్ కుమారే డైరెక్టర్ అంటూ కోలీవుడ్లో టాక్
News November 21, 2025
ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM చంద్రబాబు

AP: రాష్ట్రంలో అందరికీ గృహాలు అందించేందుకు భారీ ప్రణాళికను రూపొందిస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించాలన్నారు. మూడేళ్లలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులను గుర్తించేందుకు సర్వేను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వచ్చేలా కేంద్రంతో చర్చించాలని సూచించారు.


