News June 22, 2024
నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
AP: ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంటరీ పార్టీ నేతను సమావేశంలో ఎన్నుకునే అవకాశముంది. ఎన్డీఏలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి 16 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తే అంశాలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం.
Similar News
News October 9, 2024
ఒక్క ఫలితంతో అన్ని విమర్శలకు చెక్ పెట్టిన బీజేపీ!
హరియాణా ఎన్నికల ఫలితాలతో ఎన్నో విమర్శలకు చెక్ పెట్టగలిగామని BJP భావిస్తోంది. రైతు ఉద్యమాలు, నిరుద్యోగంపై యువతలో ఉన్న అసంతృప్తి, అగ్నివీర్, కులగణన అంశాల్లో తమ వైఖరిపై ఉన్న విమర్శలను తిప్పికొట్టగలిగామని రాజకీయ ప్రత్యర్థులకు సందేశం పంపింది. కాంగ్రెస్ రెచ్చగొట్టడం వల్లే ఈ ఆందోళనలు జరిగాయన్నట్టుగా విజయోత్సవ సభలో మోదీ వ్యాఖ్యానించారు. అయితే, ప్రజలు సుపరిపాలనకే ఓటేశారని వాదిస్తోంది.
News October 9, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 9, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:20 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:58 గంటలకు
ఇష: రాత్రి 7.11 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 9, 2024
10 గంటల పాటు అజారుద్దీన్ను విచారించిన ఈడీ
TG: హెచ్సీఏలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ను ఈడీ 10 గంటల పాటు విచారించింది. తాను విచారణకు పూర్తిగా సహకరించినట్లు ఆయన తెలిపారు. తనపై పెట్టిన కేసులన్నీ అక్రమమేనని అన్నారు. కుట్రతోనే తనపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు.