News October 17, 2024
వైసీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి
AP: వైసీపీ నేతలు అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లో చేరుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ముదునూరి మురళీకృష్ణం రాజు ఆ పార్టీని వీడారు. ప్రస్తుతం ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు ఉన్నారు. ఇవాళ మాజీ సీఎం జగన్ సమక్షంలో మురళీకృష్ణంరాజు వైసీపీలో చేరారు.
Similar News
News October 17, 2024
మందుబాబులకు షాక్.. పెరగనున్న మద్యం ధరలు?
TG: మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను సర్కార్ రెండేళ్లకోసారి పెంచుతోంది. ఈసారి వివిధ రకాల బ్రాండ్లపై రూ.20-150 వరకు పెంచాలని బ్రూవరీలు కోరాయి. ఈమేరకు త్వరలోనే ప్రభుత్వం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మద్యం ఆదాయాన్ని ఎక్సైజ్ శాఖ అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలూ ధరల పెంపునకు మరో కారణంగా తెలుస్తోంది.
News October 17, 2024
షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ
భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. NOV 18లోపు ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపర్చాలని ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లపై ఆ దేశంలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆమె బంగ్లాను వీడిన సంగతి తెలిసిందే. ఆమెపై క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యాయి. కాగా ఆమె భారత్ చేరుకున్న తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.
News October 17, 2024
ఇండియా నుంచి ఒకే ఒక్కడు!
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఇండియన్ యాక్టర్గా నిలిచారు. లండన్లోని ఫేషియల్ కాస్మొటిక్ సర్జన్ డా. జూలియన్ డి సిల్వా గోల్డెన్ రేషియో కాన్సెప్ట్తో ప్రపంచంలోని హ్యాండ్సమ్ నటుల జాబితాను రూపొందించారు. అందులో ఏకైక భారతీయ నటుడు షారూఖ్ ఖాన్(86.76%) పదవ స్థానంలో నిలిచారు. ఇంగ్లిష్ యాక్టర్ ఆరోన్ టేలర్ జాన్సన్ (93.04%)తో ప్రథమ స్థానంలో, లూసీన్ లావిస్కౌంట్ (92.41%) రెండో స్థానంలో ఉన్నారు.