News March 22, 2024

నేడు టీడీపీ మూడో జాబితా విడుదల

image

AP: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఇవాళ మూడో జాబితా విడుదల చేయనుంది. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా మహేశ్ యాదవ్ ఖరారైనట్లు సమాచారం. ఈయన యనమల రామకృష్ణుడికి అల్లుడు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా హరీశ్ (జీఎంసీ బాలయోగి కుమారుడు), బాపట్లకు కృష్ణ ప్రసాద్, హిందూపురంలో పార్థసారథికి టికెట్లు ఖరారైనట్లు సమాచారం. ఇవాళ వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Similar News

News December 18, 2025

514 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 20 – JAN 5 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, CA/CFA/CMA-ICWA, MBA/PGDBM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850. SC, ST, PwBDలకు రూ.175. వెబ్‌సైట్: bankofindia.bank.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News December 18, 2025

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<>OIL<<>>) 8 కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. MSc(కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 7న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వయసు 18 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.70,000 చెల్లిస్తారు. మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.oil-india.com

News December 18, 2025

క్యాబేజీలో నల్ల కుళ్లు తెగులు లక్షణాలు – నివారణ

image

నల్ల కుళ్లు తెగులు ఆశించి క్యాబేజీ మొక్క ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి వి(V) ఆకారంలో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నల్లగా మారతాయి. ఈ తెగులు నివారణకు 10 లీటర్ల నీటిలో స్ట్రైప్టోసైక్లిన్ 1గ్రా. కలిపి నారు నాటినప్పుడు, గడ్డ తయారైనప్పుడు పైరుపై పిచికారీ చేయాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి ఆ ద్రావణంతో మొక్కల మొదళ్ల చుట్టూ తడపాలి. ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్‌ను భూమిలో వేయాలి.