News March 30, 2024

డబ్బున్నోళ్లకే టీడీపీ టికెట్లు: వైవీ సుబ్బారెడ్డి

image

AP: డబ్బు ఉన్నవారికే TDP చీఫ్ చంద్రబాబు టికెట్లు ఇచ్చారని YCP నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ‘బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ ఓసీలకు టికెట్లు ఇచ్చింది. రూ.కోట్లు కుమ్మరించేవారికే టికెట్లు కట్టబెట్టింది. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారు. బడుగు, బలహీన వర్గాలను చట్టసభలకు పంపేందుకు CM జగన్ కృషి చేస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 23, 2026

బాక్సాఫీస్ షేక్: ₹700 కోట్ల దిశగా ‘ధురంధర్ 2’

image

రణవీర్ సింగ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తోంది. కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹691.32 కోట్ల గ్రాస్ వసూలు చేసి గదర్ 2, సలార్ వంటి మూవీల రికార్డులను అధిగమించింది. శని, ఆదివారాల్లో వరుసగా ₹100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ సినిమాగా నిలిచింది. ఇండియాలో ఇప్పటివరకు ₹454.12 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. త్వరలోనే ₹700 కోట్ల (గ్రాస్) మార్కును దాటనుంది.

News March 23, 2026

ఖాళీ స్టేడియాల్లో PSL

image

పాక్ సూపర్ లీగ్ పతనం దిశగా సాగుతోంది. మెజార్టీ విదేశీ ఆటగాళ్లు IPL వైపు మొగ్గుచూపుతుండగా, భద్రతా కారణాలతో పలువురు అక్కడికి వెళ్లట్లేదు. ఈ క్రమంలో ఈసారి ప్రేక్షకులు లేకుండా కేవలం 2 వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు PCB ఛైర్మన్ నఖ్వీ వెల్లడించారు. పొదుపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో ఆర్థిక, ఇంధన సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే.

News March 23, 2026

యుద్ధంతో అమెరికాకు ₹7,520 కోట్ల నష్టం

image

పశ్చిమాసియాలోని అమెరికన్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ జరిపిన వైమానిక దాడుల వల్ల USకు ₹7,520 కోట్ల నష్టం వాటిల్లిందని BBC, CSIS నివేదిక వెల్లడించింది. యుద్ధం మొదలైన తొలి 2 వారాల్లోనే ఈ నష్టం జరిగినట్లు అంచనా. జోర్డాన్‌లోని థాడ్ రాడార్ వ్యవస్థ ధ్వంసం అవ్వడం వల్ల సుమారు ₹4,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు US డిఫెన్స్ సిస్టమ్స్‌ను ఛేదించి ఈ విధ్వంసం సృష్టించాయి.