News March 30, 2024

డబ్బున్నోళ్లకే టీడీపీ టికెట్లు: వైవీ సుబ్బారెడ్డి

image

AP: డబ్బు ఉన్నవారికే TDP చీఫ్ చంద్రబాబు టికెట్లు ఇచ్చారని YCP నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ‘బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ ఓసీలకు టికెట్లు ఇచ్చింది. రూ.కోట్లు కుమ్మరించేవారికే టికెట్లు కట్టబెట్టింది. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారు. బడుగు, బలహీన వర్గాలను చట్టసభలకు పంపేందుకు CM జగన్ కృషి చేస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 13, 2025

ఉసిరిలో కాయకుళ్లు, నల్లమచ్చ తెగుళ్ల నివారణ

image

కాయకుళ్లు తెగులు సోకిన ఉసిరి కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వాటి నుంచి చెడువాసన వస్తుంటుంది. దీని నివారణకు కాయలను నిల్వ ఉంచే ముందు 2 శాతం ఉప్పు ద్రావణంలో కానీ లేదా 1% బోరాక్స్ మిశ్రమంలో కానీ ముంచి తీయాలి. ఉసిరిలో నల్లమచ్చ తెగులు వల్ల కాయలపై నల్ల మచ్చలు చిన్నవిగా ఏర్పడి క్రమంగా పెద్దవి అవుతాయి. తెగులు కట్టడికి లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను తొలకరి చినుకులు పడిన వెంటనే పిచికారీ చేయాలి.

News November 13, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

⋆ కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ నటించబోయే సినిమా నుంచి అనివార్య కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ సి.సుందర్
⋆ అట్లీ-అల్లు అర్జున్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మే నాటికి బన్నీ షూటింగ్ పూర్తవుతుంది: సినీ వర్గాలు
⋆ దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ, సముద్రఖని నటించిన ‘కాంత’ సినిమాకు U/A సర్టిఫికెట్.. సినిమా నిడివి 2.40hrs.. రేపే థియేటర్లలో విడుదల

News November 13, 2025

మూడేళ్లు జైల్లో గడిపిన అల్‌-ఫలాహ్ ఫౌండర్!

image

అల్-<<18273804>>ఫలాహ్<<>> యూనివర్సిటీ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ జావేద్ అహ్మద్ సిద్ధిఖీ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. MPలో జన్మించిన సిద్ధిఖీ గతంలో 9 సంస్థలను నడిపారు. వాటిలో చాలా వరకు 2019 తరువాత మూసివేశారు. చీటింగ్, నకిలీ పత్రాలు సృష్టి, నిధుల మళ్లింపు వంటి అనేక ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. రూ.7.5 కోట్ల చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష సైతం అనుభవించారు. దీంతో వర్సిటీ నిధులపై ED దర్యాప్తు చేస్తోంది.