News June 7, 2024

అధికారంలోకి టీడీపీ.. వీరిని మిస్ అవుతున్నాం: TDP శ్రేణులు

image

ఆంధ్రప్రదేశ్ గడ్డపై తెలుగు దేశం పార్టీ తిరిగి అధికారంలోకి రానుండటంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే, ఈ సంతోష సమయంలో సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలతో పాటు తారకరత్నను మిస్ అవుతున్నామని ట్వీట్స్ చేస్తున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన కోరుకునేవారు.

Similar News

News November 16, 2025

అల్లూరి జిల్లాలో బిర్సా ముండా విగ్రహావిష్కరణ.. పాల్గొన్న ఒడిశా CM

image

AP: ఒడిశా సీఎం మోహన్ చరణ్ ఇవాళ అల్లూరి జిల్లాలో పర్యటించారు. గిరిజనుల ఆరాధ్య దైవం బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకుని లగిశపల్లిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మోహన్ చరణ్‌కు రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, సంధ్యారాణి, BJP రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్‌ స్వాగతం పలికారు. స్థానిక గిరిజనులతో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో బిర్సా ముండా వీరత్వాన్ని కొనియాడారు.

News November 16, 2025

దిష్టిలో ఉన్న శాస్త్రీయత ఏమిటి..?

image

చిన్నపిల్లలు ఆహారం సరిగా తీనకపోయినా, విరేచనాలైనా దిష్టి తగిలిందని పెద్దలు అంటుంటారు. దిష్టి తీశాక పిల్లలు చలాకీగా ఆడుకుంటారు. దీని వెనకున్న సైన్స్ ఏంటంటే.. మన కళ్లకు సౌమ్యదృష్టి, క్రూర దృష్టి అనేవి ఉంటాయి. ఈ చూపుల ప్రభావంతో శరీరం నలతకు గురవుతుంది. ఉప్పు, మిరపకాయతో దిగదీయుట, వాటిని నిప్పులో వేయుట వలన వచ్చే పొగ ముక్కు ద్వారా పీల్చుకోవడం వలన నలత దూరమై, శరీరాన్ని తేలిక చేస్తుంది. <<-se>>#Scienceinbelief<<>>

News November 16, 2025

కర్మయోగి భారత్‌లో ఉద్యోగాలు

image

కర్మయోగి భారత్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, B.COM, B.Sc, బీటెక్, BE, LLB, PG, M.Sc, ME, ఎంటెక్, MBA, PGDM, MCA ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: igotkarmayogi.gov.in