News October 6, 2024
చిన్నారి మర్డర్పై టీడీపీ Vs వైసీపీ

AP: పుంగనూరులో చిన్నారి అస్పియా <<14288103>>మర్డర్<<>> అధికార, విపక్షాల మధ్య రాజకీయ దుమారానికి తెరతీసింది. ఇది ప్రభుత్వ హత్యేనని YCP ఆరోపించింది. ఇప్పటికే బాలిక ఫ్యామిలీని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. ఈనెల 9న జగన్ కూడా పుంగనూరుకు వెళ్లనున్నారు. మరోవైపు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి అనిత చెప్పారు. చిన్నారి తండ్రిని CM చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు.
Similar News
News March 28, 2026
టార్గెట్ 300.. ఏ టీమ్ కొడుతుందో?

కొన్నేళ్లుగా IPL టీమ్లను ఊరిస్తున్న స్కోర్ 300. ఈసారి ఆ స్కోర్ గ్యారంటీ అంటూ SRH కెప్టెన్ ఇషాన్ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లే జట్టులో హెడ్, అభిషేక్, క్లాసెన్, ఇషాన్, లివింగ్స్టోన్ వంటి హిట్టర్లున్నారు. IPLలో టాప్ 5 హయ్యెస్ట్ స్కోర్ల(287/3, 286/6, 278/3, 277/3, 272/7)లో తొలి 4 SRHవే. మిగతా జట్లలోనూ భీకర బ్యాటర్లున్నారు. మరి ఈ సీజన్లో 300ను ఏ జట్టు కొట్టగలదో కామెంట్ చేయండి.
News March 28, 2026
H-1B ఉద్యోగుల వేతనాల్లో భారీ పెంపు!

USలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల వేతనాలను పెంచుతూ లేబర్ డిపార్ట్మెంట్ కొత్త ప్రతిపాదనలు చేసింది. H-1B, E-3 వంటి వీసాదారులకు ఇచ్చే మినిమం శాలరీ పెరగనుంది. దీనివల్ల ఏటా ఒక్కో ఉద్యోగికి ₹13 లక్షల అదనపు లబ్ధి చేకూరనుంది. విదేశీయులకు తక్కువ జీతాలిచ్చి స్వదేశీయులను తొలగించకుండా ఉండేందుకే 20 ఏళ్ల పాత వేతన విధానాన్ని మారుస్తున్నారు. వీటిపై అభిప్రాయాలు సేకరించి అమలు చేస్తారు.
News March 28, 2026
ఆయిల్ పామ్ తోటల్లో పరాగసంపర్కం

ఆయిల్ పామ్ తోటల్లో పరాగ సంపర్కం గాలి ద్వారా, కీటకాల ద్వారా జరుగుతుంది. ఇలాయిడోబియస్ కామెరూనికస్ అనే కీటకం పరాగ సంపర్కంలో కీలకపాత్ర వహిస్తుంది. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన 2.5 సంవత్సరాల తర్వాత తోటల్లో ఈ కీటకాలను విడుదల చేస్తే ఫలదీకరణ బాగా జరిగి ఫలములు ఏర్పడతాయి. చెట్లు ఆరోగ్యంగా లేకపోతే ఈ కీటకాలను 3 సంవత్సరాల తర్వాత తోటల్లో విడుదల చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


