News May 10, 2024
జూన్ 4న ఏపీలో టీడీపీ కనుమరుగు: ఎంపీ VSR

AP: టీడీపీ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ అడుగడుగునా ఆ పార్టీ రాజీపడుతోందని YCP ఎంపీ విజయసాయిరెడ్డి Xలో ఎద్దేవా చేశారు. నల్ల నాగుపాము, టీడీపీ లీడర్ ఒకేసారి కనిపిస్తే ముందుగా టీడీపీ నేతనే కొట్టాలని పిలుపునిచ్చారు. ‘రాజ్యసభలో టీడీపీ కనుమరుగైంది. తెలంగాణలో ఆ పార్టీ అంతమయ్యింది. జూన్ 4న ఏపీలోనూ సైకిల్ పార్టీ కనుమరుగు కాబోతోంది’ అని జోస్యం చెప్పారు.
Similar News
News October 29, 2025
SECLలో 595 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సౌత్ ఈస్ట్రర్న్ కోల్ఫీల్డ్స్(SECL)లో<
News October 29, 2025
తుఫాన్.. ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు

AP: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు, మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం(మత్స్యకారులకు 50కేజీలు), లీటర్ నూనె, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర అందించనుంది. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని మార్కెటింగ్ కమిషనర్కు సూచించింది.
News October 29, 2025
భారీ వర్షాలు.. కల్లాల మీద ధాన్యం ఉందా?

కోతకోసి కుప్ప మీద ఉన్న ధాన్యాన్ని బరకాలు కప్పుకొని రైతులు రక్షించుకోవాలి. నూర్చిన ధాన్యం రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలులేని పరిస్థితుల్లో ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక లేదా ఎండు వరిగడ్డిని కలిపితే గింజను వారం రోజులపాటు మొలకెత్తి చెడిపోకుండా నివారించుకోవచ్చు. ఎండ కాసిన తర్వాత ధాన్యాన్ని ఎండబెట్టి, తూర్పార పట్టి నిలువ చేసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ సూచించింది.


